ఓ అవినాష్… మరో పరమేశ్వర్.. ఇంకో గంగిరెడ్డి..! వైఎస్ వివేకా కేసులో ట్విస్టులు..!

వైఎస్ వివేకా హత్య కేసులో.. అంతా చిక్కుముడి వీడిపోయినట్లే ఉంది… కానీ ఏమీ తెలియడం లేదన్నట్లుగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివేకా మరణం గురించి మొదటగా… చూసి… పోలీసులకు సమాచారం ఇచ్చిన వైఎస్ అవినాష్ రెడ్డిని … ప్రత్యేక దర్యాప్తు బృందం పిలిపించి ప్రశ్నించింది. ఎందుకు అబద్దం చెప్పాల్సి వచ్చిందన్న అంశంపై స్టేట్‌మెంట్ తీసుకున్నారు. వివేకా గుండెపోటుతో మృతి చెందారని అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి సెల్‌ నుంచి పోలీసులకు ఫోన్‌ వచ్చిందని నిన్న కడప జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ చెప్పారు. కొంత సమయం తర్వాత అవినాష్ కార్యాలయంలో పనిచేసే భరత్‌రెడ్డి నుంచి కూడా ఇదే విషయంపై నేరుగా ఎస్పీకే ఫోన్‌ చేశారు. వీటన్నింటిపైనా ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

మరో వైపు పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పేరు హఠాత్తుగా తెరపైకి వచ్చింది. పరమేశ్వర్ రెడ్డి మూడు దశాబ్దాలుగా.. వివేకానరెడ్డికే కాదు..వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఎస్ కుటుంబీకుల తరపున సెటిల్మెంట్లు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూంటారు. వివేకా చనిపోయిన తర్వతా పరమేశ్వర్ రెడ్డి జాడ లేకపోవడంతో.. ఆయన పనేనని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ పరమేశ్వర్ రెడ్డి.. తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో ఉన్నారు. మీడియాను పిలిచి తనకే పాపం తెలియదని.. చెప్పుకొచ్చారు. పోలీసులు వచ్చి తనను ప్రశ్నించారని… అది ఇంటి దొంగల పనేనని ..మీరు మీరు తేల్చుకోండి.. మమ్మల్ని ఇరికించవద్దని చెప్పి పంపించామంటున్నారు.

పులివెందుల సమీపంలోని కసనూరుకు చెందిన పరమేశ్వర్‌రెడ్డి సెటిల్‌మెంట్లు, భూ వివాదాలు పరిష్కరించేవాడని, వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని, ఇటీవల ఓ వివాదంలో పరమేశ్వర్‌తో వివేకా గొడవపడ్డాడని, వివేకా హత్యకు పది రోజుల ముందు త్వరలో ఓ సంచలనం చూస్తారంటూ పరమేశ్వర్‌ కొందరి వద్ద మాట్లాడాడని ప్రచారం జరిగింది. దీనికి తోడు వివేకా హత్య తర్వాత పరమేశ్వర్‌రెడ్డి చూడడానికి కూడా రాలేదంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబీకుల కోసమే పనిచేస్తున్నామని కావాలనే మాపైన పుకార్లు పుట్టించారు… అయినా ఎవరు ఎలాంటి వారో జగన్‌ సార్‌కు తెలుసు అంటూ పరమేశ్వర్ రెడ్డి భార్య వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close