ఏపిలో రెండు వైకాపా వికెట్లు డౌన్?

తెలంగాణాలో తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లిపోతుంటే, ఆంధ్రాలో కాంగ్రెస్, వైకాపాల నుండి తెదేపాలోకి వస్తున్నారు. అందుకు వారు చెప్పే కారణం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం లేదా సదరు ముఖ్యమంత్రులు రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషిలో బాగస్వాములు అవడం లేదా రేవంత్ రెడ్డి చెప్పిన వేరే ఇతర కారణాలు కావచ్చును. కానీ అసలు కారణం మాత్రం ఆ రెండు పార్టీలు అధికారంలో ఉండటమే. నీరు పల్లమెరుగు అన్నట్లు లేదా బెల్లం చుట్టూ ఈగలు ముసురుతున్నట్లు అధికారం ఉన్న చోటికే రాజకీయ నేతలందరూ చేరుకొంటుంటారు. కానీ ఏనుగుకి పైకి కనబడే దంతాలు. నోట్లో తినే దంతాలు వేరేగా ఉన్నట్లే రాజకీయ నాయకులు కూడా పార్టీలు మారడానికి ఏవేవో ‘ఇష్టోరీలు’ చెపుతుంటారు.

ఇక విషయంలోకి వస్తే ప్రకాశం జిల్లాకి చెందిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు గోడ దూకేయడానికి సిద్దంగా ఉన్నాట్లు తాజా సమాచార, వారిలో ఒకరు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కాగా మరొకరు కందుకూరు ఎమ్మెల్యే పి.రామారావు. ఇద్దరూ తెదేపాలో చేరడానికి సంసిద్దత వ్యక్తం చేయగా చంద్రబాబు నాయుడు కూడా ఒకే చెప్పేసినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కానీ స్థానిక తెదేపా నేతల నుండి అభ్యంతరాలు వస్తునందున ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అద్దంకిలో కరణం బలరామ్, కందుకూరులో దివి శివరామ్ నుండి అభ్యంతరాలు చెపుతున్నారు. ఇంకా కడపలో వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా సిద్దంగా ఉన్నప్పటికీ ఆయనకీ అదే సమస్య ఎదురవడంతో గత రెండు నెలల నుండి లైన్ క్లియర్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే వైకాపాను దొంగల పార్టీ అని, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి ని ఆ దొంగల ముఠాకి నాయకుడని తెదేపా నేతలు తరచూ విమర్శిస్తున్నప్పుడు మళ్ళీ ఆ దొంగల ముఠా నుండే ఎమ్మెల్యేలను పార్టీలో ఎందుకు చేర్చుకొంటున్నట్లో…వైకాపాలో ఉన్నప్పుడు నేరస్తులుగా కనిపించిన వారందరూ తెదేపాలో చేరిపోగానే నిష్కళంకమైన నేతలుగా మారిపోతారనుకోవాలేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close