మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే మరాఠీ భాషా ఉద్యమం కోసం ఐక్యంగా కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని, త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ముంబైలో జూలై 5, 2025న ఉమ్మడి ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా థాక్రే వారసులు ఒకే వేదిక మీదప్రసంగించనున్నరాు. ఇది వారి సయోధ్యకు సంకేతం. ఏప్రిల్ 2025లో కూడా వీరిద్దరూ సయోధ్యకు సిద్ధంగా ఉన్నట్లు సూచనలు ఇచ్చారు. అనేక సంవత్సరాల విభేదాల తర్వాత మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కోసం వీరు కలిసి పోటీ చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.
బాల్ థాక్రే శివసేన పార్టీ పెట్టి మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నప్పుడు ఆయన తరపున పనులన్నీ చక్కబెట్టేది రాజ్ థాక్రేనే. ముంబైను గడగడలాడించింది బాల్ థాక్రే కానీ.. ఆయన తరపున ఆ పని చేసేది రాజ్ థాక్రే. శివసేన పార్టీలోనూ ఆయన చాలా పవర్ ఫుల్ గా ఉండేవారు. ఆయన బలమైన నాయకత్వం శివసేనకు మరింత బలం పెరిగేలా చేసింది. అయితే బాల్ థాక్రే కూడా అందరిలాగే.. తన పార్టీ వారసత్వం తన వారసులకే ఉండాలనుకున్నారు. రాజ్ థాక్రే సొంత కుమారుడు కాదు. సోదరుని కుమారుడు. సొంత కుమారుడు అయిన ఉద్ధవ్ రాజకీయాల్లోకి వచ్చాక.. రాజ్ థాక్రేను బయటకు పంపేశారు.
రాజ్ మహారాష్ట్ర నవ నిర్మాణ సమితిని ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకంటూ ఇప్పటికీ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. గొప్ప ఫలితాలు ఎప్పుడూ సాధించ లేదు కానీ.. బలమైన నేతగానే ఉన్నారు. శివసేన చీలిపోవడం వల్ల క్రమంగా బలహీనపడింది. చిరికి షిండే అధికారిక పార్టీ షిండే చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు థాక్రేలకు తమదే నిజమైన శివసేన అని నిరూపించుకోవాల్సిన అవసరం పడింది. ముఖ్యంగా ఉద్దవ్ కు. అందుకే రాజ్ థాక్రేతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరూ కలిస్తే.. మళ్లీ శివసేనకు పూర్వవైభవం రావొచ్చని.. షిండే ను నిర్వీర్యం చేయవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.