ఉక్రెయిన్ కోల్పోవడానికి ఇక ఏమీ లేదు. కానీ రష్యాను మాత్రం ఏ చిన్న దెబ్బకొట్టినా అది ఆ దేశానికి మంచి విజయమే. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ చూసి చూసి వ్యూహాత్మక దెబ్బలు కొడుతోంది. దీంతో రష్యాకు తీవ్ర నష్టం ఏర్పడుతోంది. డ్రోన్లు, అండర్వాటర్ బాంబులతో రష్యా కూడా ఊహించని యుద్ధ వ్యూహాలతో ఉక్రెయిన్ విరుచుకుపడుతోంది.
తాజాగా రష్యాతో క్రిమియాను కలిపే బ్రిడ్జ్పై అండర్వాటర్ దాడి చేసింది. ఈ దాడి మంగళవారం జరిగింది. యీ దాడితో బ్రిడ్జ్ అండర్వాటర్ సపోర్ట్లు దెబ్బతిన్నాయి. ఇక ఆ వంతెన వినియోగానికి పనికి రాదు. అంతకు రెండు రోజుల ముందు ఉక్రెయిన్ 117 డ్రోన్లను ఉపయోగించి రష్యాలోని నాలుగు ఎయిర్బేస్లపై దాడి చేసింది. ఒకటిన్నర సంవత్సరం పాటు ప్లాన్ చేసి ఈ దాడి చేశారు. రష్యన్ స్ట్రాటజిక్ బాంబర్లు, A-50 సర్వైలెన్స్ విమానాలు ధ్వంసమయ్యాయి. ట్రక్కులలో దాచి రష్యాకు స్మగ్లింగ్ చేసి రష్యా గడ్డమీద నుంచే దాడులు చేసింది.
ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా గతంలో ఆక్రమించుకుంది. అక్కడ రష్యా బలగాలను బలహీనం చేయడంలో ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రష్యా సైనిక సామర్థ్యాన్ని వ్యూహాత్మకంగా జెలెన్ స్కీం బలహీనపరిచే వ్యూహాలను అమలు చేస్తున్నాడు. ఉక్రెయిన్ చేస్తున్న దాడులను రష్యా “తీవ్రవాద చర్యలు”గా చెబుతోంది. ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది. కానీ ఉక్రెయిన్ ఇప్పటికే కోల్పోవాల్సినంత కోల్పోయింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ఆపేస్తానని ప్రకటించారు కానీ ఆయన డీల్ చేయలేకపోయారు. జెలెన్ స్కీపై ఓ సారి.. పుతిన్ పై మరోసారి అసహనం ప్రదర్శిస్తూ.. సమస్యను మరింత జఠిలం చేశారు.