గుర్తింపులేని వారసత్వ సంపదలు – మన ప్రాచీన ఆలయాలు

మానవ అస్ధిత్వానికి మూలంగా భావించే దైవాన్ని అవ్యక్త స్ధితి నుంచి మేల్కొల్పి, గర్భగృహ నిర్మాణం చేసి, ఆ ఆవరణను పవిత్రీకరించడం హిందూ మతంలో కీలకాంశం. దైవానికి మానవరూపాన్ని ఆపాదించి, స్నానం చేయించి, ఊరేగించి, తినిపించి, స్త్రీ దేవతను జతచేసి సంతృప్తి పొందే హిందూ జీవనంలో చిత్తచాంచల్యాన్ని నిరోధించే ఆలోచన కనిపిస్తుంది. లక్ష్యాలు గమ్యాల మీద దృష్టి, ఏకాగ్రతలను సాధించే ఒక మార్గదర్శనం వుంది.

చరిత్రతో ముడిపడి వున్న ప్రాచీన ఆలయాలు, కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో లేబుల్ వేస్తుంది. మహారాష్ట్ర, ఒడిస్సా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నో ఆలయాలకు ఆ గుర్తింపు వుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఆలయానికి కూడా వారసత్వ సంపదగా గుర్తింపు లేదు.

దాక్షారామ, శ్రీశైలం, అమరావతి, పాలకొల్లు మొదలైన అనేక ప్రాంతాలలో శివాలయాలతో సహా తిరుమలలో వెంకటేశ్వరాలయం, తాడిపత్రిలో చింతల వెంకటరమణ ఆలయం, చేజెర్లలో కపోతేశ్వర ఆలయం, మొదలైన ఎన్నో గుడులు ప్రాచీన మైనవే. ప్రాచీన సాంప్రదాయాల మేరకే వున్నవే!

వీటి మరమ్మత్తులు నిర్వహణల్లో కేవలం ఆధునికత మీద మాత్రమే దృష్టిపెట్టిన ప్రభుత్వాలు, ట్రస్టు బోర్డు పెద్దలు అందులో ప్రాచీన, సాంస్కృతిక మూలాలను మార్చేయడం లేదా సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోవడం వల్లే ఈ పరిస్ధితి వచ్చింది.

భౌతిక ప్రయోజనాలు, తక్షణ అవసరాలమీదే ఆంధ్రప్రదేశ్ ను పాలించిన అన్ని ప్రభుత్వాలూ దృష్టిపెట్టాయి. హేతువాదుల పాలనా ప్రాబల్యంవున్న తమిళనాడులో ప్రభుత్వాలు ఎన్నడూ మూలాలను దెబ్బతీసేలా వ్యవహరించలేదు. ఆలయాల జీర్ణోద్ధరణను ఆగమ వాస్తు పండితులకే వదిలేశారు. ఇదే వాతావరణం కర్నాటక కేరళల్లో కూడా వుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏ గుడిలో అయినా రాతి స్ధంభం కూలిపోతే స్టీల్ ఫ్రేముతో గట్టిగా కాంక్రీట్ వేయించండి అనే ముఖ్యమంత్రులే వున్నారు. ఈ దృక్పధం వల్లే ప్రాచీనత వేగంగా శిధిలమైపోతోంది.

ప్రార్ధనాలయాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలను వాటివల్ల ఏర్పడిన యాంబియన్స్ పాడవ్వకుండా జీర్ణోద్దరణ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. వాటి ఫలితాలు కనబడుతున్నాయి. వాటిని మనం కూడా పాటిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రాచీన ఆలయాలకు దేశదేశాల యాత్రికులు వస్తారు.

మన పూర్వీకుల ఉద్దేశం ప్రకారం దేవాలయాలు సమాజానికి ఉమ్మడి ఆస్ధిగా వుండాలి. ధార్మిక, నైతిక, మానసిక పరివర్తనా కేంద్రాలుగా వుండాలి. వీధుల్లో యాచకులను నిరోధించి ఆశ్రయమిచ్చే కేంద్రాలు కావాలి. మానసిక ప్రశాంతతకు ఆశ్రయాలు అవ్వాలి.

అందుకు తగిన ఏంబియన్స్ అవసరం…దాన్ని కొత్తగా సృష్టించనవసరంలేదు. ఉన్నదాన్నే బయటపడేలా ట్రిమ్ చేస్తే చాలు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close