మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చారు. తనకు పదే పదే శ్వాసకోశ సమస్యలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటికే ఓ సారి చికిత్స చేయించారు. అక్కడ సమస్యలు లేవని చెప్పినా.. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని వంశీ చెప్పడంతో మరిన్ని పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చారు.
గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆయన భార్య పంకజశ్రీ హడావుడి చేశారు. తన భర్తను కలుస్తానని చెప్పారు. అయితే పోలీసులు కోర్టు అనుమతి లేకుండా కలవడం కుదరదని చెప్పారు. అయినప్పటికీ ఆమె లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వైసీపీ నేతలు కూడా పలువురు వచ్చే దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వంశీ ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ లో ఉన్నారు. మరో కేసులో పీటీ వారెంట్ అమల్లో ఉంది. అయితే ఆ కేసులో అరెస్టు కాకుండా రక్షణ ఉంది.
వంశీ అరెస్టు అయి మూడు నెలలకుపైగా అయింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదదారుడ్ని కిడ్నాప్ చేసి బెదిరించి.. కేసు వాపసులు తీసుకునేలా చేశారన్న అభియోగాలతో అరెస్టు అయ్యారు. ఆ కేసులో బెయిల్ వచ్చింది కానీ.. ఇతర కేసుల్లో పీటీ వారెంట్ దాఖలు చేయడంతో జైల్లోనే ఉండాల్సి వస్తోంది. అనారోగ్య కారణాలతోబెయిల్ కోసం ఆయన బెయిల్ కోసం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.