ఫ్లాష్ బ్యాక్‌: ఒకే ట్యూన్ రెండు పాట‌లు

ఇళ‌య‌రాజా – వంశీల‌ది అద్భుత‌మైన కాంబినేష‌న్‌. వీళ్ల సినిమాల్లో పాట‌లంటే ఇప్ప‌టికీ చెవులు కోసేసుకొంటారు సంగీత ప్రియులు. ఈ కాంబినేష‌న్‌లో ‘అన్వేష‌ణ‌’ అనే సినిమా వ‌చ్చింది. సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. థ్రిల్ల‌ర్ చిత్రాల్లో అదో మైల్ స్టోన్‌. పాట‌లూ సూప‌ర్ హిట్టే. ఇందులో `ఇల‌లో..` అనే పాటొక‌టి వుంది. ప‌ల్ల‌వి వ‌ర‌కూ.. కొత్త ట్యూనే. కానీ చ‌ర‌ణం వ‌ర‌కూ వ‌చ్చేసరికి `ప్రేమ ఎంత మ‌ధురం` పాట గుర్తొస్తుంది. ఈ చ‌ర‌ణాన్ని అచ్చు గుద్దిన‌ట్టు ‘అన్వేష‌ణ‌`లో వాడేశారు. ఈ రెండు సినిమాలకూ ఇళ‌య‌రాజానే సంగీత ద‌ర్శ‌కుడు. తాను వాడిన ట్యూన్ అదే భాష‌లో.. మ‌రో పాట‌కు వాడ‌డం ఇళ‌య‌రాజా చ‌రిత్ర‌లోనే లేదు. మ‌రి… ఈ ‘కాపీ’ ఎలా జ‌రిగింది? ఎందుకు జ‌రిగింది? అస‌లు విష‌యం ఏమిటంటే..

‘ప్రేమ ఎంత మ‌ధురం’ ట్యూన్ లోనే ఓ క‌న్న‌డ సినిమా కోసం పాట కంపోజ్ చేశారు ఇళ‌య‌రాజా. అప్ప‌ట్లో వంశీతో ఇళ‌య‌రాజాకు మంచి చ‌నువు, అభిమానం ఉండేవి. ఇళ‌య‌రాజా ఏ పాట చేసినా… ముందు వంశీనే వినేవారు. అలా.. క‌న్న‌డ చిత్రానికి సంబంధించిన ట్యూన్ వంశీ విన్నారు. ‘ఇది బాగుంది… మ‌న సినిమాలో వాడుకొందాం’ అని వంశీ చెప్ప‌డం, దానికి ఇళ‌య‌రాజా ఒప్పుకోవ‌డం జ‌రిగిపోయాయి. అయితే… అదే ట్యూన్‌లో ‘అభినంద‌న‌’కు ఓ పాట కంపోజ్ చేసిన విష‌యం ఇళ‌య‌రాజాకు గుర్తు లేదు. ఆ సంగ‌తి వంశీకీ తెలీదు. అలా… ‘ఇల‌లో’ పాట పుట్టింది. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే `ప్రేమ ఎంత మ‌ధురం` ప‌ల్ల‌వి ‘ఇల‌లో’ పల్ల‌వి రెండూ వేర్వేరు ట్యూన్లు. చ‌ర‌ణాలు మాత్రం ఒక‌టే ట్యూన్‌లో సాగుతాయి. ‘అభినంద‌న‌’ 1987లో విడుద‌ల అయితే ‘అన్వేష‌ణ‌’ 1985లో వ‌చ్చింది. నిజానికి ఈ రెండు సినిమాల‌కూ సంబంధించిన సంగీత ప‌నులు దాదాపు ఒకేసారి జ‌రిగాయి. కానీ ‘అభినంద‌న‌’ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యంగా విడుద‌లైంది. దాంతో… ‘అన్వేష‌ణ‌’ ట్యూన్ ని ‘అభినంద‌న‌’ కోసం ఇళ‌య‌రాజానే మ‌ళ్లీ కాపీ కొట్టార‌ని అనుకొంటారంతా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close