జగన్‌పై వంశీ ఒత్తిడి ఫలించినట్లే..!?

జగన్మోహన్ రెడ్డి తనను నిర్లక్ష్యం చేయకుండా… ఆయనపై అమితమైన అభిమానాన్ని ఇప్పటి వరకూ ఉన్న పార్టీపై అసహ్యమైన ఆరోపణల్ని చేసిన.. వల్లభనేని వంశీ అనుకున్నది సాధించినట్లుగా చెబుతున్నారు. వంశీని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే.. తన క్యారెక్టర్ మీద మచ్చ పడుతుందన్న ఉద్దేశంతో.. జగన్మోహన్ రెడ్డి ఆయనను పార్టీలో చేర్చుకుని.. గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రస్తుత గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావును.. జగన్ పిలిపించి మాట్లాడారు. భవిష్యత్‌లో పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని సర్దిచెప్పారు. అంటే దానర్థం… ఇప్పటికి వంశీకే.. నియోజకవర్గాన్ని అప్పచెప్పబోతున్నారని… వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

దీపావళికి ముందు జగన్మోహన్ రెడ్డిని వంశీ కలిశారు. అప్పుడే.. యార్లగడ్డ వెంకట్రావు.. వంశీపై ఫైరయ్యారు. అప్పుడే.. జగన్ పిలిచి మాట్లాడతారని అనుకున్నారు. కానీ జగన్ పట్టించుకోలేదు. చివరికి.. వంశీ… చంద్రబాబు దీక్ష రోజు… ప్రెస్‌మీట్ పెట్టి… జగన్‌పై అమితమైన అభిమానాన్ని చూపారు. అదే నోటితో.. చంద్రబాబును, లోకేష్‌ను తిట్టారు. ఇప్పుడు.. వంశీని కాదంటే… ఇలా రోడ్డు మీద వదిలేస్తారేమోనన్న భయం ఇతర నేతల్లోనూ వెళ్లిపోతుందని.. అలా జరిగితే.. ఎవరూ పార్టీలోకి రారని వైసీపీ వ్యూహకర్తలు భావించారు. అందుకే.. యార్లగడ్డను.. పిలిపించారు.

మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ యార్లగడ్డ వెంకట్రావును తీసుకుని జగన వద్దకు వెళ్లారు. వెంకట్రావు విషయం తాను చూసుకుంటాని జగన్ భరోసా ఇచ్చారు. వెంకట్రావు భవిష్యత్‌పై పూర్తి భరోసా ఇచ్చారు। మీపై నమ్మకం ఉందని జగన్‌తో చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే.. గన్నవరం ను వదులుకోవడానికి యార్లగడ్డ రెడీ అయ్యారని అంటున్నారు. అంతే కాదు.. రెండు రోజుల కిందట… కొడాలి నాని కూడా ఇదే చెప్పారు. కావాలంటే.. యార్లగడ్డకు గుడివాడ ఇచ్చేస్తానని ప్రకటించారు. అంటే.. వంశీకి గన్నవరం ఇచ్చేసినట్లేనన్నమాట..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close