మ‌హేష్‌పై ఆశ వ‌దులుకోని వంశీ

స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర‌వాత మ‌హ‌ర్షి కాంబినేష‌న్ రిపీట్ అవ్వాల్సింది. కాని కొన్ని కార‌ణాల వ‌ల్ల‌… ఆ సినిమా ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి మ‌హేష్ కోసం ఓ క‌థ త‌యారు చేసుకున్నా, అది మ‌హేష్ అంచ‌నాల‌కు త‌గిన‌ట్టుగా రాక‌పోవ‌డంతో ఆ సినిమాని మ‌హేష్ ప‌క్క‌న పెట్టేశాడు. చిరంజీవి 152 వ చిత్రంతో మ‌హేష్ త్వ‌ర‌లోనే బిజీ కాబోతున్నాడు. ప‌ర‌శురామ్‌, అనిల్ రావిపూడి.. ఈ ఇద్ద‌రూ మ‌హేష్ కోసం కొత్త క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు.

అయితే… వంశీ మాత్రం మ‌హేష్ సినిమాపై ఆశ‌లు వ‌దులుకోలేదు. `మా కాంబోకి కాస్త బ్రేక్ వ‌చ్చిందంతే. క‌థ కుదురుకోగానే ప‌ట్టాలెక్కుతుంది` అంటూ స‌న్నిహితుల ద‌గ్గ‌ర న‌మ్మ‌కంగా చెబుతున్నాడ‌ట‌. మ‌హేష్ కూడా వంశీతో అదే చెప్పాడ‌ట‌. `మ‌న కాంబోలో సినిమా ఉంది. కానీ కాస్త ఆల‌స్యం అవుతుందంతే`అని ధైర్యం చెప్పాడ‌ట‌. చిరంజీవి 152వ సినిమాలో మ‌హేష్ న‌టించ‌డం నిజ‌మే అయితే.. ఆ సినిమా కోసం త‌ను 30 రోజుల కాల్షీట్లు ఇవ్వాల్సివ‌స్తుంది. ఈలోగా వంశీ స‌రైన క‌థ చెప్ప‌గ‌లిగితే.. ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయం. బ‌హుశా… వంశీ ధైర్యం కూడా అదే కావొచ్చు. వంశీ లాంటి ద‌ర్శ‌కుడికి `నో`చెప్ప‌డం మ‌హేష్‌ని కాస్త ఇబ్బంది పెట్టే విష‌య‌మే. ఓ ద‌ర్శ‌కుడిగా కాకుండా, ఓ స్నేహితుడిగా వంశీ మ‌హేష్‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ నేప‌థ్యంలో వంశీకి వెన్నుద‌న్నుగా నిల‌వాల‌నుకుంటున్నాడు మ‌హేష్‌. ఈ చిత్ర‌సీమ‌లో ఏదైనా జ‌ర‌గొచ్చు. ప‌ట్టాలెక్కాల్సిన సినిమా ఆగిపోవొచ్చు. ఆగి పోయిన సినిమా మొద‌ల‌వ్వొచ్చు. వంశీ న‌మ్మ‌కం కూడా అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close