డైలామాలో వ‌రుణ్‌తేజ్ సినిమా?

‘ఎఫ్ 3’తో ఓ హిట్టు కొట్టాడు వ‌రుణ్ తేజ్‌. గ‌ని ఫ్లాపుని అలా క‌వ‌ర్ చేసుకోగ‌లిగాడు. వ‌రుణ్ కొత్త క‌థ‌ల్ని విని, ఓకే చేసుకొనే ప‌నిలో ఉన్నాడు. ప్ర‌వీణ్ స‌త్తారుతో ఓ సినిమా వ‌రుణ్ ప‌ట్టాలెక్కించాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చి కాల కాలం అయ్యింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్‌డేటూ లేదు. వాస్త‌వానికి ఈ సినిమా కాస్త డైలామాలో ఉంద‌ని స‌మాచారం. ఈ ప్రాజెక్టు ముందుకీ వెన‌క్కి ఊగుతోంద‌ని, వ‌రుణ్ ఈ క‌థ‌ని హోల్ట్ లో పెట్టాడ‌ని టాక్‌. దానికి గ‌ల కార‌ణాలు మాత్రం తెలీలేదు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోసం ఇప్ప‌టికే నిర్మాత కొంత మొత్తం ఖ‌ర్చు పెట్టాడు. విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. అక్క‌డ వీసాల కోసం ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. అయితే స‌డ‌న్ గా… ఆ ప్ర‌య‌త్నాల్ని ప‌క్కన పెట్టారు. ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి ఈ సినిమాపై ఎలాంటి మూమెంటూ లేదు. ఇవ‌న్నీ చూస్తుంటే ఈ సినిమాఆగిపోయిందేమో అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌వీణ్ స‌త్తారు ప్ర‌స్తుతం నాగార్జున‌తో ‘ఘోస్ట్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీనిపై కూడా ఎలాంటి బ‌జ్ లేదు. అందుకే నిర్మాత ఈ ప్రాజెక్టుని వెయిటింగ్ లిస్టులో పెట్టారేమో. ఒక‌వేళ ఘోస్ట్ రిలీజ్ అయి, పెద్ద విజ‌యం సాధిస్తే అప్పుడు ఏమైనా క‌ద‌లిక రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close