దృశ్యం 3 కూడానా..?!

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన దృశ్యమ్‌ని తెలుగులో రీమేక్ చేసి, ఇక్క‌డా హిట్ కొట్టారు. అక్క‌డ దృశ్య‌మ్ 2 వ‌స్తే.. ఇక్క‌డా రీమేక్ చేశారు. దాని ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇప్పుడు దృశ్య‌మ్ 3 కూడా రాబోతోంది. ఈ విష‌యాన్ని వెంక‌టేష్ స్వ‌యంగా చెప్పారు. దృశ్య‌మ్ 3 ఆలోచ‌న ఉందా? అని అడిగిన ప్ర‌శ్న‌కు వెంక‌టేష్ స‌మాధానం ఇచ్చారు.

”జీతూ జోసెఫ్ తో ఈ విష‌యం మాట్లాడాను. త‌ప్ప‌కుండా మ‌రో మంచి సీక్వెల్ తో వ‌స్తా.. కానీ ఇప్పుడే కాదు… ఓ ఐదారేళ్లు ప‌ట్టొచ్చు అన్నాడు. చూద్దాం…. అప్పుడు కూడా ఈ రాంబాబు రెడీగానేఉంటాడు. కాక‌పోతే… జుత్తు నెరిసిపోతుంది. గ‌డ్డం వ‌చ్చేస్తుంది. పిల్ల‌లు మ‌రింత పెద్ద‌వాళ్లు అయిపోతారు..” అని చెప్పుకొచ్చాడు వెంకీ. ఈ సినిమా నేరుగా ఆమేజాన్ ప్రైమ్ లో విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా రెండు సినిమాలు (నార‌ప్ప‌, దృశ్యం 2) ఓటీటీకి వెళ్లిపోవ‌డంతో వెంకీ ఫ్యాన్స్ కాస్త ఫీల‌వుతున్నారు. కానీ వెంకీ మాత్రం `నా ఫ్యాన్స్ అలాంటివేం ప‌ట్టించుకోరు` అంటున్నాడు. ”నా అభిమానుల‌కు నాపై పెద్ద‌గా అంచనాలు ఏమీ ఉండ‌వు. అందుకే నేను నా వంతు ప్ర‌యోగాలు చేస్తుంటా. రెండు సినిమాలు ఓటీటీలో వ‌చ్చాయి. ఈసారి థియేట‌ర్లో చూడ‌ద‌గ్గ సినిమా ని విడుద‌ల చేస్తా. ఎఫ్ 3ని హాయిగా థియేట‌ర్ల‌లోచూసుకోవ‌చ్చు. నా సినిమాలు ఓటీటీలోనే రావాల‌ని నేనేం ప్లాన్ చేయ‌లేదు. అవి వ‌చ్చాయి. అంతే. ఓటీటీలో అయినా, థియేట‌ర్లో అయినా మంచి సినిమాని ప్రేక్ష‌కుల‌కు ఇవ్వాల‌న్న‌దే ఆ ఆశ‌” అన్నారు వెంకీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close