వైసీపీ సోషల్ మీడియా టీంకు విజయసాయి భరోసా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బృందాలకు విజయసాయిరెడ్డి మంచి ట్రీట‌్ చేస్తున్నారు. పార్టీ తన చేతి నుంచి జారిపోయినా.. సోషల్ మీడియా మాత్రం విజయసాయిరెడ్డి చేతుల్లోనే ఉంది. ఇటీవలి కాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కోర్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలే దీనికి కారణం. సీబీఐ విచారణ కూడా ప్రారంభమయింది. కోర్టులపై చేసిన వ్యాఖ్యలుఅన్నీ ఆర్గనైడ్డ్‌గా జరగడంతో… తాము ఇరుక్కుపోతామనే భావన చాలా మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో ఉంది. అందుకే.. వారి ఇటీవలి కాలంలో తమ జోరు తగ్గించారు. దీంతో విజయసాయిరెడ్డి.. అందర్నీ మళ్లీ కార్యోన్ముఖుల్ని చేయాలని నిర్ణయించుకున్నారు.

తాడేపల్లిలో..అన్ని రాష్ట్రాల సోషల్ మీడియా సపోర్టర్స్‌ను పిలిచి తాడేపల్లిలో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో తానున్నానని భరోసా ఇస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి .. సోషల్ మీడియానే కీలకమని.. అందుకే… ముఖ్యమంత్రి జగన్.. వారికి ఇచ్చిన అన్ని హామలను నెరవేర్చడానికి సిద్ధంగామని విజయసాయిరెడ్డి వారికి ధీమా కల్పించే ప్రయత్నం చేశారు. ఎనిమిది నుంచి పదివేల మంది వరకూ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారని.. అందరికీ ఇచ్చిన హమీలు నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు.

తిట్లు, శాపనార్థాలు, దాడులతో వైసీపీ సోషల్ మీడియా.. కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో.. కోర్టుధిక్కరణ వంటి కేసులు పెడితే.. వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే విజయసాయిరెడ్డి… సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టి పోరాట చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంలో ఆదినారాయణకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close