పీపీఏల సమీక్ష, రివర్స్ టెండర్ల మరకలు మోడీ, షాలకు అంటించిన విజయసాయి..!

పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు, పోలవరం రివర్స్ టెండర్ల విషయంలో.. తమపై పడిన మరకల్ని .. వైసీపీ పెద్దలు నేరుగా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలకు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. పీపీఏల సమీక్ష అయినా… పోలవరం రివర్స్ టెండర్లు అయినా… అన్నింటినీ తాము.. కేంద్రానికే చెప్పి చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పాట అందుకుంది. తాము ప్రతి నిర్ణయాన్ని… ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు చెబుతున్నామని.. వారి అంగీకారం మేరకే.. పీపీఏల రద్దు, పోలవరం రివర్స్ టెండర్లపై ముందుకెళ్తున్నామని… విజయసాయిరెడ్డి ఢిల్లీలో నేరుగా ప్రకటించారు. తమ నిర్ణయాల ప్రభావం… పరిణామాలు కేంద్రానికి అంటించే ప్రయత్నాన్ని ఏ మాత్రం మొహమాటం లేకుండా చేశారు.

పీపీఏల సమీక్ష వద్దని కేంద్రం పదే పదే లేఖలు పంపింది. పోలవరం రివర్స్ టెండర్లు వద్దని కూడా..పోలవరం పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ అంత కంటే గట్టిగానే చెప్పింది. అయినా ఏపీ సర్కార్… కేంద్రాన్ని లెక్కలోకి తీసుకోనట్లుగా నిర్ణయాలు ప్రకటిస్తూనే ఉంది. ఆర్థిక వ్యవస్థపైనే కాదు… పెట్టుబడుల వాతావరణంపై..ప్రభావం పడే నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని కేంద్రం కూడా ప్రశ్నించింది. తమ దేశాలకు చెందిన పెట్టుబడి సంస్థల కోసం… హెచ్చరికలతో కూడిన లేఖలు పలు దేశాల నుంచి కేంద్రానికి..రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయలేదు. వివాదాస్పద నిర్ణయాలన్నింటికీ.. మోదీ, షా పర్మిషన్ ఉందని చెప్పడం ద్వారా.. విజయసాయిరెడ్డి… బీజేపీ అగ్రనేతలతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

నిజంగా విజయసాయిరెడ్డి … పీపీఏల రద్దు, పోలవరం రివర్స్ టెండర్ల కోసం…మోడీ , షాల నుంచి పర్మిషన్ తీసుకుని ఉంటే.. కేంద్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో హెచ్చరికలతో కూడిన లేఖలు వచ్చి ఉండేవే కావు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. ఆ నిర్ణయాలన్ని .. మోదీ, షాల చలువేనన్నట్లుగా.. ప్రచారం ప్రారంభించేసారు. దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినకూడదని… కేంద్రం పట్టుదలతో ఉంది. ఇలాంటి సమయంలో.. పీపీఏల సమీక్షకు.. పోలవరం రివర్స్ టెండర్లకు.. మోదీ , షా అనుమతి ఇచ్చే అవకాశం లేదని బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. తమపై పడిన మరకను..నేరుగా… మోడీ, షాలకు … అంటించే ప్రయత్నాన్ని విజయసాయిరెడ్డి చేయడం ఇప్పుడు ఢిల్లీలో కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close