ఇట్స్ అఫీషియల్.. ఉత్తరాంధ్ర వరకే విజయసాయి పాత్ర..!

విజయసాయిరెడ్డి పెత్తనానికి జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టారంటూ…కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అధికారికంగా ముద్రపడింది. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగిస్తూ..జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు విజయసాయిరెడ్డికి.. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో .. వైవీ సుబ్బారెడ్డికి.. కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. పార్టీ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అప్పగించారు.

గతంలోనూ… విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాలే ఉండేవి. ఇతర నేతలకు వేలే జిల్లాలు కేటాయించేవారు. కానీ.. పార్టీ వ్యవహారాలను మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. పార్టీ కేంద్ర కార్యాలయం మొత్తం ఆయన గుప్పిట్లో ఉండేది. ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ టీంతో సమన్వయం చేసుకోవడం పార్టీ టిక్కెట్ల వ్యవహారం .. మొత్తం విజయసాయిరెడ్డినే డీల్ చేశారు. మొన్నటిదాకా ఆయనకు తిరుగులేదనే ప్రచారం ఉంది. కానీ హఠాత్తుగా ఏం జరిగిందో కానీ..మెల్లగా ఆయనను దూరం పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ ఆయన ఇటీవల కనిపించడం తగ్గించారు.

ఢిల్లీలో వ్యవహారాలను మరో ఎంపీ బాలశౌరి చక్క బెడుతున్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్లకే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో.. ఆయనకు ప్రాధాన్యం తగ్గిస్తూ..నిర్ణయం వెలువడింది. ఒక్క సారి విజయసాయిరెడ్డిపై జగన్ వ్యతిరేకంగా ఉన్నారు..అన్న ప్రచారం జరిగితే.. ఆయన వైపు ఒక్క వైసీపీ నేత కూడా కన్నెత్తి చూడరు. ఒకప్పుడు ఆయనతో రాసుకుపూసుకు తిరగడానికి ప్రాధాన్యం ఇచ్చే నేతలు.. ఆయనతో కన్నా.. సజ్జలతో టచ్‌లో ఉండటానికి ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close