బీజేపీని కాకా పట్టేందుకు కాంగ్రెస్‌పై చిందులేసిన విజయసాయిరెడ్డి !

ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన బీజేపీ అధికారంలో ఉంటే పదేళ్లుగా విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పై చెలరేగిపోయారు విజయసాయిరెడ్డి. షర్మిల ప్రత్యేకహోదా పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆయనకు కోపం వచ్చింది. ఎవరు ప్రశ్నిస్తే వారి వల్లే ప్రత్యేకహోదా రాలేదని అనడం వైసీపీ స్టైల్. బురద చల్లేసి రాజకీయం చేయడం వైసీపీ స్టైల్. ఇప్పుడు ఆయన అదే చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ను విమర్శిస్తూ బీజేపీకి గిలిగింతలు పెడుతూ.. ఆయన చేసిన ప్రసంగం చూసి తోటి సభ్యలు కూడా ఎంత కష్టం అని చిరునవ్వులు చిందించారు. రాజ్యసభలో రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది.

ఇందులో మాట్లాడే అవకాశం విజయసాయిరెడ్డికి వచ్చింది. ఆయన తన ప్రసంగం మొత్తం కాంగ్రెస్ ను విమర్శించడానికి వాడుకున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ వస్తుందని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని జోస్యం చెప్పి బీజేపీ నేతలకు గిలిగింతలు పెట్టారు. చట్టంలో పెట్టకపోవడం వల్లే ప్రత్యేకహోదా రాలేదన్నారు కానీ.. ఇస్తామన్న బీజేపీ ఇవ్వకపోవడంపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ లో షర్మిల చేరడాన్ని కుటుంబంలో చిచ్చుపెట్టడంగా చెప్పుకున్న ఆయన.. మరి కాంగ్రెస్ కు ఆ ఫ్యామిలీ చేసిన ద్రోహం గురించి చెప్పలేకపోయారు.

విజయసాయిరెడ్డి ఎక్కడ టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందోనన్న భయంతో.. తాము కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లలేదని నిరూపించడానికి అన్నట్లుగా విజయసాయిరెడ్డి చెలరేగిపోయినట్లుగా కనిపిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి జిమ్మిక్కులు ఎంత వరకూ పనికి వస్తాయో కానీ.. పదేళ్లుగా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని నిందించి.. బీజేపీని పల్లెత్తు మాట అనలేని.. ప్రతిపక్ష పార్టీలోని నేతగా విజయసాయిరెడ్డి వ్యవహారం మాత్రం.. అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close