బీజేపీని కాకా పట్టేందుకు కాంగ్రెస్‌పై చిందులేసిన విజయసాయిరెడ్డి !

ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన బీజేపీ అధికారంలో ఉంటే పదేళ్లుగా విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పై చెలరేగిపోయారు విజయసాయిరెడ్డి. షర్మిల ప్రత్యేకహోదా పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆయనకు కోపం వచ్చింది. ఎవరు ప్రశ్నిస్తే వారి వల్లే ప్రత్యేకహోదా రాలేదని అనడం వైసీపీ స్టైల్. బురద చల్లేసి రాజకీయం చేయడం వైసీపీ స్టైల్. ఇప్పుడు ఆయన అదే చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ను విమర్శిస్తూ బీజేపీకి గిలిగింతలు పెడుతూ.. ఆయన చేసిన ప్రసంగం చూసి తోటి సభ్యలు కూడా ఎంత కష్టం అని చిరునవ్వులు చిందించారు. రాజ్యసభలో రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది.

ఇందులో మాట్లాడే అవకాశం విజయసాయిరెడ్డికి వచ్చింది. ఆయన తన ప్రసంగం మొత్తం కాంగ్రెస్ ను విమర్శించడానికి వాడుకున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ వస్తుందని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని జోస్యం చెప్పి బీజేపీ నేతలకు గిలిగింతలు పెట్టారు. చట్టంలో పెట్టకపోవడం వల్లే ప్రత్యేకహోదా రాలేదన్నారు కానీ.. ఇస్తామన్న బీజేపీ ఇవ్వకపోవడంపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ లో షర్మిల చేరడాన్ని కుటుంబంలో చిచ్చుపెట్టడంగా చెప్పుకున్న ఆయన.. మరి కాంగ్రెస్ కు ఆ ఫ్యామిలీ చేసిన ద్రోహం గురించి చెప్పలేకపోయారు.

విజయసాయిరెడ్డి ఎక్కడ టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందోనన్న భయంతో.. తాము కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లలేదని నిరూపించడానికి అన్నట్లుగా విజయసాయిరెడ్డి చెలరేగిపోయినట్లుగా కనిపిస్తోంది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి జిమ్మిక్కులు ఎంత వరకూ పనికి వస్తాయో కానీ.. పదేళ్లుగా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని నిందించి.. బీజేపీని పల్లెత్తు మాట అనలేని.. ప్రతిపక్ష పార్టీలోని నేతగా విజయసాయిరెడ్డి వ్యవహారం మాత్రం.. అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close