బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పిటిషన్ పబ్లిసిటీ కోసమే కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని కౌంటర్లో విజయసాయిరెడ్డి ఆరోపించారు. రఘురామపై చాలా సీబీఐ, క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బెయిల్పై ఉన్న విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజుసీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ వేయాలని కోర్టు సీబీఐతో పాటు విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. సీబీఐ .. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అఫిడవిట్ వేసింది.
విజయసాయిరెడ్డి ఇప్పుడు కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. విజయసాయిరెడ్డి తన ఎంపీ హోదాను అడ్డు పెట్టుకుని తరచూ ఆర్థిక శాఖ అధికారుల్ని కలుస్తూ… సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తున్నారని రఘురామ పిటిషన్లో ఆరోపించారు. అలాగే… అశోక్ గజపతిరాజుకు సంబంధించి మాన్సాస్ విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో న్యాయవ్యవస్థకు ఉద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. బెయిల్ పై ఉన్న వ్యక్తి ఇలా చేయడం నిబంధనల ఉల్లంఘనేనన్నారు .
అయితే విజయసాయిరెడ్డి రఘురామ పిటిషన్కు కౌంటర్గా ఆయనపై ఆరోపణలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పబ్లిసిటీ కోసం పిటిషన్ వేశారని.. కేసులున్ాయని చెప్పడం ద్వారా.. తన బెయిల్ రద్దు చేయకూదని ఎలా వాదిస్తారో కానీ… విజయసాయిరెడ్డి మాత్రం తాను బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని గట్టిగా చెప్పడానికి తన కౌంటర్లో ప్రయత్నాలు చేయలేదు. రఘురామకు ఉద్దేశాలు ఆపాదిస్తే.. బెయిల్ పిటిషన్ కొట్టి వేస్తుందని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లుగా ఉన్నారు.