చివరికి కుప్పానికి విశాల్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు !

కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటున్న వైసీపీకి దారి తెలుస్తున్నట్లుగా లేదు. మున్సిపల్ ఎన్నికల్లో చేసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేమని అర్థమైందేమో కానీ ఇప్పుడు సినీ హీరోను చంద్రబాబుపై పోటీకి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ హీరో విశాల్ రెడ్డిని ఇందు కోసం సంప్రదించారని వైసీపీలోని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. నెల్లూరుకు చెందిన విశాల్ రెడ్డి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. సామాజికవర్గ పరంగా వచ్చిన సాన్నిహిత్యంతో ఆ కుటుంబానికి వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి.

విశాల్ రెడ్డికి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉంది. కాకపోతే ఆయన తమిళ రాజకీయాల్లో ఉన్నారు. ఓ సందర్భంలో అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాల్లో భాగమయ్యారు. శశికళ జైలుకెళ్లిన తర్వాత జయలలిత నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీటీడీ దినకరన్‌పై ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. నామినేషన్ పత్రాలతో వెళ్లినా చివరికి వెనక్కి తగ్గారు. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారు. ఏపీ రాజకీయాలపై ఆయనకు ఆసక్తి ఉందో లేదో కానీ వైసీపీ వర్గాలు విశాల్ రెడ్డి పేరు ప్రచారంలోకి తెచ్చాయి.

ప్రస్తుతం కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి కుమారుడు. ఇప్పుడు చంద్రమౌళి చనిపోయారు. కానీ ఆయన చంద్రబాబుకు పోటీ ఇవ్వలేరని వైసీపీ నిర్ణయించుకుంది. అందుకే కొత్త అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. సినీ తార అయితే బెటరని విశాల్ పేరు పరిశీలిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం పెద్దగా లేకపోయినప్పటికీ.. తమిళ ఓటర్లు ఉన్నారని వాళ్లు ఓట్లేస్తారని వైసీపీ భావన. విశాల్ రెడ్డి మాత్రమే కాదు.. మరో ఇద్దరు బీసీ నేతల పేర్లను కూడా ప్రచారంలోకి తెస్తున్నారు.

విశాల్ రెడ్డి సినిమా కెరీర్ ఏమంత ఉత్సాహంగా సాగడం లేదు. ఆయనపై రకరకాల వివాదాలు ఉన్నాయి. తమిళసినీ పరిశ్రమలో ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలోనూ ఆయనను బద్నాం చేస్తున్నారా లేకపోతే.. నిజంగానే అలాంటి ఆలోచన విశాల్‌కు ఉందా అన్నది ఆయన చెబితేనే తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close