విజ‌య్ దొర‌క‌లేదు.. చైతూతో స‌ర్దుబాటు

`ల‌వ్ స్టోరీ`తో ఓ డీసెంట్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు నాగ‌చైత‌న్య‌. ఇప్పుడు `థ్యాంక్యూ`తో బిజీ. ఓ వైపు `బంగార్రాజు` కూడా ఉంది. దాంతో పాటు… విక్ర‌మ్ కె.కుమార్ తో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. దాంతో పాటు కొత్త క‌థ‌లూ వింటున్నాడు. తాజాగా నందినిరెడ్డి చెప్పిన క‌థ‌కు చైతూ ఓకే చెప్పేశాడు. ఈచిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ సంస్థ నిర్మించ‌నుంది. నందినిరెడ్డి సంతోష్ శోభ‌న్ తో ఓ సినిమా చేస్తోంది. అది ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అది అవ్వ‌గానే చైతూ సినిమా మొద‌లెడుతుంది.

`థ్యాంక్యూ` చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్త‌యిన‌ట్టే. `బంగార్రాజు` కోసం చైతూ 20 నుంచి 25 రోజుల కాల్షీట్లు ఇస్తే స‌రిపోతుంది. ఆ త‌ర‌వాత‌.. నందినిరెడ్డి సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ‌కూడా చైతూతో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడు. కానీ.. క‌థ ఇప్ప‌టి వ‌ర‌కూ సెట్ కాలేదు. మ‌రోవైపు నందినిరెడ్డి వైజ‌యంతీ మూవీస్ ద‌గ్గ‌ర ఎప్పుడో అడ్వాన్స్ తీసుకుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో వైజ‌యంతీ మూవీస్ ఓసినిమా చేయాల్సింది.కానీ కుద‌ర్లేదు. విజ‌య్ గ‌నుక అందుబాటులో ఉంటే.. ఆ సినిమా నందినిరెడ్డితోనే ప‌ట్టాలెక్కేది. విజ‌య్ దొరక్క‌పోవ‌డంతో చైతూతో ఈ సినిమా ప‌ట్టాలెక్కించాల్సివ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close