ఇంతకూ బంద్ విజయవంతమయిందా?

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ తాము నిర్వహించిన బంద్ విజయవంతమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. విఫలం చేయటానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారని వైసీపీ నేతలు బొత్స, ధర్మాన ప్రెస్ మీట్‌లు పెట్టి చెప్పారు. ఇక జగన్ అయితే బంద్‌కు సహకరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బంద్ ప్రజల ఆకాంక్షలను తెలియజేసిందని చెప్పారు. బంద్ నిర్వహిస్తున్న 40మంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కావాలనే 144 సెక్షన్ అమలు చేశారని, విద్యార్థులను చితకబాదారని అన్నారు.

మరోవైపు, బంద్ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలుగుదేశం నేతలు చెప్పుకొచ్చారు. ఈ బంద్‌ను జనం అస్సలు పట్టించుకోలేదని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. రాఖీ పండగరోజు బంద్‌కు పిలుపునిచ్చి జగన్ హిందూ సంప్రదాయాలను గాలికొదిలేశారని ఆరోపించారు. వైసీపీ బంద్‌ను కేవలం ఒక ఈవెంట్ జరపటంకోసం ప్రయత్నిస్తోందితప్ప ప్రజలకు మేలుచేసే ఉద్దేశ్యంతోకాదని టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు అన్నారు.

ఏది ఏమైనా బంద్‌ను విజయవంతం చేయాలనీ వైఎస్ఆర్ కాంగ్రెస్, విఫలం చేయాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించాయనేది వాస్తవం. అయితే వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేయటం, కమిటెడ్ కార్యకర్తలు ఉండే వామపక్షాలు మద్దతు పలకటంతో బంద్ విజయవంతమైందనే చెప్పాలి. రాజమండ్రి, అనకాపల్లివంటి కొద్దిచోట్ల వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లను ముట్టడించిన ఘటనలు మినహా దాదాపు ప్రశాంతంగానే సాగింది. జగన్, బొత్స, ధర్మాన వంటివారు తప్పితే వైసీపీలోని నేతలందరూ రోడ్లపైకి వచ్చి బంద్ చేయించారు. విజయసాయిరెడ్డి, కొడాలి నాని, వంగవీటి రాధా, పార్థసారధివంటి నేతలు అరెస్ట్ అయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close