చంద్రబాబు దక్షిణాదిన మహాకూటమి ఏర్పాటు చేస్తే?

బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయానికి కారణాలు ఏవయినప్పటికీ దాని ప్రభావం బీజేపీపై చాలా ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచి ఉండి ఉంటే ఇక దానిని అడ్డుకోవడం ఎవరితరం అయ్యేది కాదు. కానీ చాలా ఘోరంగా ఓడిపోవడంతో బీజేపీ దూకుడుకి కళ్ళెం పడినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించినంత వరకు చూసుకొంటే, తెదేపా-బీజేపీల స్నేహం ఇష్టంలేని కాపురంలాగ సాగుతోందని రెండు పార్టీల నేతలు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వ సహాయసహాకారాలు అవసరమనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు మోడీకి అణిగిమణిగి ఉంటున్నారనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మోడీ రాష్ట్రానికి చెయ్యి విదిలించడం లేదు. పైగా రాష్ట్ర బీజేపీ నేతలు తెదేపా ప్రభుత్వానికి పక్కలో బల్లెంలాగ తయారయ్యారు. వారు తమ పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సంగతి మరిచిపోయి, ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బిహార్ లో బీజేపీ ఘోరపరాజయం పొందడం, బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుండటం, తెదేపాకు కొత్త ఆలోచనలను కల్పించినట్లయింది. ఒకవేళ కేంద్రప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు తమ ప్రభుత్వంతో ఇదేవిధంగా వ్యవహరించినట్లయితే, మున్ముందు పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు కూడా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక కూటమిని తయారుచేసే ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చును. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో బీజేపీకి చాలా నష్టం కలుగవచ్చును. కనుక రాష్ట్ర బీజేపీ నేతలు తెదేపా ప్రభుత్వ పరిస్థితిని అర్ధం చేసుకొని దానితో సంయమనంగా వ్యవహరించడం మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close