పీవీ సింధుకు ఏమైంది..?

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి ఏమైంది..? ఆమెపై ఇటీవల పెరిగిపోతున్న రూమర్స్‌కి .. తాజాగా ఆమె చేసిన రిటైర్మెంట్ ట్వీట్‌కు సంబంధం ఏమిటి..? . ఇప్పుడు క్రీడా ప్రేమికుల్లో ఇదే చర్చ జరుగుతోంది. పీవీ సింధు హఠాత్తుగా ఓ ట్వీట్ చేసింది. మొదటి పేజ్‌లో  ..ఐ రిటైర్ అని టైటిల్ పెట్టింది. దీంతో ఆమె రిటైర్ అవుతుందేమోనని అందరూ  అనుకున్నారు. కానీ మిగతా రెండు పేజీల్లో మాత్రం వేదాంతం వల్లించింది. తాను నెగెటివిటికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానన్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే వచ్చే ఏడాది ఆసియా  కప్ వరకూ బ్యాడ్మింటన్ టోర్నీల్లో ఆడట్లేదని మాత్రం క్లారిటీ ఇచ్చింది. దీంతో సింధుకు ఏమైందన్న చర్చ ప్రారంభమయింది. 

కొద్ది రోజుల కిందట.. గోపీచంద్‌తో పాటు తల్లిదండ్రులతోనూ పీవీ సింధు గొడవపడి లండన్ వెళ్లిపోయిందని ఓ ఇంగ్లిష్ పత్రికలో వార్త వచ్చింది. దాన్ని సింధు ఖండించింది. తన కోసం జీవితం త్యాగం చేసిన వాళ్లపై తానెందుకు అలుగుతానని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము మెరుగైన ఫిట్ నెస్ కోసమే లండన్ వచ్చానని చెప్పుకుంది. అయితే సింధు ఫిట్ నెస్ కోసం లండన్ వెళ్లినా…  టోర్నీలు ఆడకూడదని నిర్ణయించుకోవడం ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలగడానికి కారణం అవుతోంది. 

తన నెగెటివిటీకి కారణంగా కరోనాను.. పీవీ సింధు చెబుతున్నారు. కానీ.. కరోనా సమస్య ఒక్క పీవీ సింధుకే ఎందుకు సమస్యగా మారిందనేది చాలా మందికి అర్థం కాని విషయం. అయితే.. పీవీ సింధు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల్లో ఒత్తిడికి గురవుతున్నారని.. అందుకే.. రిటైర్మెంట్ పేరుతో బ్లాక్ మెయిలింగ్ లాంటి ట్వీట్లు చేశారని అంటున్నారు. మొత్తానికి పీవీ సింధు విషయంలో.. సమ్ ధింగ్.. సమ్ ధింగ్ అనుకునే పరిస్థితి మాత్రం ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close