రాజన్న క్యాంటీన్లు ఏమయ్యాయి..?

తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన అన్నక్యాంటీన్లను కొత్త ప్రభుత్వం రాగానే నిలిపివేసింది. వాటితో పాటు రాజన్న క్యాంటీన్లు కూడా నిలిచిపోయాయి. అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించిన సమయంలో.. వైసీపీ నేతలు.. నియోజకవర్గాల వారీగా.. రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు. రోజా సహా… మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకూ పదుల సంఖ్యలో.. వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతలు..రాజన్న క్యాంటీన్లు పెట్టారు. అప్పట్లో అన్న క్యాంటీన్లు ఉన్నప్పటికీ.. వాటి వల్ల మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వారు పెట్టారు. కొంత మందికి రూ. నాలుగుకే భోజనం పెట్టారు. తాము వచ్చినా.. రూ.ఐదుకే భోజనం ఉంటుందని.. ఆ క్యాంటీన్ల ద్వారా నమ్మకం కలిగించారు.

ఇప్పుడు.. ఎక్కడా వారి క్యాంటీన్లు కూడా నడవడం లేదు. పేదలకు రూ. 5 భోజనం అందుబాటులో లేకుండా పోయింది. అదే సమయంలో.. ఇసుక కొరతతో.. భవన నిర్మాణ కూలీలకు పనులు లేకుండా పోయాయి. కనీసం అన్న క్యాంటీన్లలో ఆకలి తీర్చుకుందామనుకున్నా..ప్రయోజనం లేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… ప్రారంభించిన క్యాంటీన్లను అధికారంలోకి రాగానే ముసేశారు. ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లనూ క్లోజ్ చేశారు. అంటే.. తాము పెట్టడం లేదు.. ప్రభుత్వం తరపున పెట్టనివ్వడం లేదు.

ఇప్పటికీ టీడీపీ నేతలు పలు చోట్ల అన్న క్యాంటీన్లు పెట్టిన దగ్గరే.. దాతల సాయంతో…భోజన ఏర్పాట్లు చేశారు. ఉపాధి కోల్పోయిన కూలీలకు వీలైనంతగా… కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో.. పవన్ కల్యాణ్ కూడా ఆ ప్రయత్నం చేశారు. ప్రభుత్వం.. ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నప్పుడు..పోటీగా క్యాంటీన్లు పెట్టిన వైసీపీ నేతలు.. ఇప్పుడు వాటిని మూసేయడమే కాకుండా… భోజనం పెడుతున్న టీడీపీ, వైసీపీలపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయం అంటే కడుపు నింపడం కాదు.. కడుపు కొట్టడం అంటే ఇదేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close