ఏపీ బీజేపీ గురించి పట్టించుకునే మీడియా ఏది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఇప్పుడు గింజుకుంటున్నారు. గతంలో ఏదో ఓ మీడియాలో కవరేజీ వచ్చేది. ఇప్పుడు ఏ మీడియాలోనూ వారు కనిపించడం లేదు. గతంలో ఆంధ్రజ్యోతినే ఎంతో కొంత కవరేజీ ఇచ్చేది. ఇప్పుడు ఆ చాన్స్ లేకుండా పోయింది. వారే స్వయంగా ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయడంతో ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. తిరుపతి ఉపఎన్నికల నేపధ్యంలో సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ మీడియాలోనూ వారి హడావుడి కనిపించడం లేదు. గతంలో అలా ఉండేది కాదు. ఇప్పుడు… ఎన్నికల షెడ్యూల్ వచ్చినా… అసలు బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తుందో కూడా పట్టించుకునే తీరిక లేదు. జనసేన పార్టీ సీటును త్యాగం చేసేసింది. అప్పుడు కావాల్సినంత హైప్ రావాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా భిన్నం. పార్టీల వారీగా చీలిపోయింది. ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా.. ఒక్క న్యూస్ మాత్రమే రిపోర్ట్ చేస్తూ ఈటీవీ ఒక్కటే కాస్త తటస్థంగా కనిపిస్తూ ఉంటుంది మిగతా చానళ్లలో బీజేపీకి కవరేజీ కావాలంటే… ఆయా పార్టీలకు అనుకూలమైన ప్రకటనలు లేదా.. తమకు దగ్గరగా ఉన్న పార్టీకి వ్యతిరేక పార్టీపై విమర్శలు చేయాలి. అలా అయితేనే కవరేజీ వస్తుంది. అలా చేయడం వల్ల.. ఆ పార్టీలకు మాత్రమే లాభం కానీ .. బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. ఇప్పుడు బీజేపీ ఉపఎన్నికల బరిలో దిగింది. ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది మీడియా అండ. బీజేపీకి అంతో ఇంతో సపోర్ట్‌గా నిలిచే ఆంధ్రజ్యోతి కవరేజీ లేకపోవడంతో.. ఆ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది.

తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారం కోసం ఇప్పుడు బీజేపీ వెంపర్లాడాల్సిందే. ఎందుకంటే… వైసీపీ అనుకూల మీడియాలో ఇక బీజేపీకి చోటు దక్కదు. ఎందుకంటే.. ఆ పార్టీ భారీ మెజార్టీపై కన్నేసింది. ఏమైనా ఢిల్లీ స్థాయిలో అండర్ స్టాండింగ్ పెట్టుకుని కవరేజీ ఇవ్వాలన్న రూల్ ఉంటే తప్ప కవరేజీ రాదు. ఇక టీడీపీ అనుకూల మీడియాను ఓ రకంగా బీజీపేనే దూరం పెట్టింది. ఇక సోషల్ మీడియాలోనూ ఆ పార్టీ అంత చురుకుగా లేదు. ఏతావాతా చివరికి… తన కోపమే తనకు శత్రువన్నట్లుగా బీజేపీ మీడియా కేవరేజీకి గండి పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close