ఎల్‌ఐసీ కన్నా అదానీకే డిమాండ్ – ఏమిటీ విచిత్రం ?

దేశంలో నెంబర్ వన్ లాభాలు , ఆస్తులు ఉన్న కంపెనీ ఏది. మరో మాటలేకుండా చెప్పేది ఎల్‌ఐసీ గురించే. ఇలాంటి కంపెనీ వాటాలను అమ్మాలని కేంద్రం నిర్ణయిస్తే.. షేర్ మార్కెట్లో ఆ కంపెనీకి తిరుగు ఉండదనుకున్నారు. రూ. రెండు వేలకు షేర్ అమ్మితే.. లిస్టింగ్ అయిన వారంలో ఎడెనిమిది వేలకు చేరుకుంటుదనుకున్నారు. కానీ వాస్తవంలో అది రివర్స్ అయిది. ఎల్‌ఐసీ షేర్ల కోసం ఎగబడినవారు ఉన్నప్పటికీ.. వాటిని షేర్ మార్కెట్లో కొనడానికి ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. ఫలితంగా షేర్ ధర పడిపోతూ వస్తోంది. లిస్టింగ్ ప్రైస్ కన్నా తక్కువ ధర నమోదవుతూండటంతో.. వాటాదార్లు భారీగా నష్టపోయారు.

అదే సమయంలో అదానీ గ్రూప్ షేర్లు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. ఆ కంపెనీల లాభాలతో నిమిత్తం లేకుండా షేర్లు పెరిగిపోతున్నాయి. అదానీ విల్మర్ పేరుతో ఉన్న కంపెనీ ఎడిబుల్ ఆయిల్.. కొన్ని ఆహార ఉత్పత్తులు అమ్ముతూ ఉంటుంది. ఆ కంపెనీ లాభాలు.. ఖర్చుల సంగతేమో కానీ షేర్ మాత్రం ఎల్‌ఐసీ కంటే ఎక్కువగా గ్రోత్ నమోదు చేస్తోంది. అదానీ కంపెనీకి చెందిన ఇతర షేర్లూ అదే దారిలో ఉండటంతో ఆయన అత్యంత సంపన్నుడిగా మారిపోయారు.

అయితే ఎల్‌ఐసీ ఎందుకు చేదయింది… అదానీ గ్రూప్ ఎందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు తీపి అయిందనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఎల్ఐసీ విషయంలో మార్కెట్ వర్గాల అంచనాలు కూడా తలకిందలయ్యాయి. గొప్ప సంచలనం నమోదవుతుందనుకుంటే.. నిర్వీర్యమైన పరిస్థితి కనిపిస్తోంది. మార్కెట్ అంతా మాయాజాలం అని.. ఓ రకమైన గ్యాంబ్లింగ్ అని.. ఎల్‌ఐసీ విషయంలోనూ.. అదానీ విషయంలోనూ అదే జరుగుతోందని.. ఆశపడి పెట్టుబడులు పెట్టిన వారు నిరాశపడుతున్నారు. కాస్త వాస్తవంగా ఆలోచిస్తే.. నిజమేనని ఎవరికైనా అనిపించకమానదు. మరదే స్టాక్ మార్కెట‌్ అని కొంత మంది ఏకవాక్యంతో సమర్థిస్తూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close