ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ మద్దతు అడగడానికి బీజేపీకి ఈగో అడ్డొస్తోందా ?

ఏపీలో మూాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులు ఓట్లు వేయబోతున్నారు. తెలుగుదేశం, బీజేపీ, వైసీపీలు అభ్యర్థుల్ని నిలబెట్టాయి. జనసేన పార్టీ నిలబెట్టలేదు. మరో పది రోజుల తర్వాత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మద్దతు ఎవరికన్నది స్పష్టత లేకుండా పోయింది. వైసీపీకి మాత్రం వేయవద్దు.. మీ ఇష్టం వచ్చినవారికి వేయండి అని పార్టీ సానుభూతిపరులకు నాదెండ్ల మనోహర్ సందేశం పంపారు. ఇదే పవన్ కల్యాణ్ సందేశం అని చెబుతున్నారు.

నిజానికి పవన్ కల్యాణ్ ఇప్పటికీ తాను బీజేపీతో పొత్తులోనే ఉన్నానని చెబుతున్నారు. బీజేపీ కూడా అదే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి అధికారంలోకి వస్తామని అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలు చేస్తూంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మద్దతు అడగడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈగోకు పోయినట్లుగా కనిపిస్తోంది. పవన్ మద్దతు అడగకపోవడంతో.. అడగకుండా మద్దతు ఇవ్వడం ఎందుకని పవన్ కల్యాణ్ కూడా సైలెంట్ అయినట్లుగా చెబుతున్నారు.

బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలు జరిగినప్పుడు జనసేన పార్టీ పోటీ నుంచి విరమించుకుంటున్నట్లుగా ప్రకటించినా బరిలో నిలిచిన బీజేపీ.. జనసేన పేరును విస్తృతంగా ఉపయోగించుకున్నారు. పవన్ కల్యాణ్ బొమ్మ చూపి ఓట్లేయాలని అడిగారు. ఇప్పుడు పవన్ .. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. మరి తమకు మద్దతు ఇవ్వాలని అడగడానికి బీజేపీ నేతలకు నోరు రావడంలేదు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి యువత నుంచి కూడా మద్దతు ఉంటుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. పవన్ మద్దతిస్తే ప్లస్ అయ్యేది. కానీ ఆయన మద్దతు కోసం బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close