ల‌తా మంగేష్క‌ర్ పేరుని గిన్నిస్ బుక్ ఎందుకు తొల‌గించింది?

ల‌తా మంగేష్క‌ర్‌… నిన్న‌టి వ‌ర‌కూ పాట‌ల పూదోట‌. ఇప్పుడొక జ్ఞాప‌కం. ల‌తాజీ సాధించిన విజ‌యాలు అపూర్వం.. అనిత‌ర సాధ్యం. ఆమె దాదాపు 50 వేల పాట‌లు పాడార‌న్న‌ది ఓ అంచ‌నా. ఇన్ని పాట‌లు పాడిన గాయ‌నీమ‌ణి మ‌రొక‌రు లేరు. 1974లోనే గిన్నిస్ బుక్ ఆమె ప్ర‌తిభ గుర్తించింది. అప్ప‌టికి ల‌త 25 వేల పాట‌లు పూర్తి చేశారు. అందుకే అత్య‌ధిక పాట‌లు పాడిన గాయ‌నిగా ఆమె పేరు గిన్నిస్ బుక్ లో లిఖించారు. అయితే ఆ త‌ర‌వాత‌.. కొన్నేళ్ల‌కు ల‌తాజీ పేరుని గిన్నిస్ బుక్ తొల‌గించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. 1974లో ల‌తా మంగేష్క‌ర్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కాక‌.. మ‌రో లెజెండ‌రీ గాయ‌కుడు మ‌మ‌హ్మ‌ద్ ర‌ఫీ.. దానిని క్లైమ్ చేశారు. ల‌తా కంటే నేనే ఎక్కువ పాట‌లు పాడాను అని ఆధారాలు చూపించారు. దాంతో.. గిన్నిస్ బుక్ ఆలోచ‌న‌లో ప‌డింది. 1975లో వ‌చ్చిన ఎడిష‌న్ లో ల‌త పేరుతో పాటు ర‌ఫీ పేరు కూడా చేర్చింది. ఆ త‌ర‌వాత ఆధారాలు సేక‌రిస్తే అప్ప‌టికి ల‌త పాడిన పాట‌లు 5 వేలే అని తేలింది. ల‌తాజీ అంత‌కంటే ఎక్కువ పాట‌లు పాడినా, వాటి వివ‌రాలు ఎక్క‌డా రాసుకోలేదు. అందుకే.. చాలా పాట‌లు క‌నుమ‌రుగైపోయాయి. అలా పాతిక వేల పాట‌లు పాడినా… కేవ‌లం 5 వేలే దొరికాయి. అందుకే.. 1991లో ల‌త పేరుని గిన్నిస్ బుక్ తొల‌గించింది. ఇప్ప‌టికైతే గిన్నిస్ బుక్‌లో అత్య‌ధిక పాట‌లు పాడిన గాయ‌కుడుగా ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, గాయ‌నిగా సుశీల పేర్లు లిఖించ‌బడ్డాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close