టికెట్ రేట్ల గురించి మాట్లాడ‌డం రాజ‌కీయమా?

టికెట్ రేట్ల వ్య‌వ‌హారంపై నాగార్జున క‌ప్ప‌దాటు వైఖ‌రి… విస్మ‌ర ప‌రిచే విష‌య‌మే. `టికెట్ రేట్ల‌తో నాకు ఇబ్బంది లేదు..` అంటూ ఈ విష‌యంపై మాట్లాడ‌డానికి నాగార్జున నిరాక‌రించ‌డం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓవ‌ర్గానికి మింగుడుప‌డ‌డం లేదు. చిత్ర‌సీమ అంతా.. టికెట్ రేట్లు పెంచండి బాబూ.. అంటూ మొత్తుకుంటుంటే, `నాకు ఎంతున్నా ఫ‌ర్వాలేదు..` అని నాగ్ చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యమే.

సీనియ‌ర్ హీరోగా చిత్ర‌సీమ ఇబ్బందుల గురించి మాట్లాడాల్సిన బాధ్య‌త నాగార్జున‌కు ఉంది. పైగా నాగార్జున ఓ నిర్మాత కూడా. ప‌రిశ్ర‌మ గురించి, ఇక్క‌డి ఇబ్బందుల గురించి ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రిపే వ్య‌క్తుల్లో ముందు వ‌రుస‌లో ఉండే పేరు నాగార్జున‌. ఆమ‌ధ్య ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల్ని క‌లిసిన‌ప్పుడు, తెలంగాణ‌లో శ్రీ‌నివాస యాద‌వ్ తో స‌మావేశం అయిన‌ప్పుడు నాగార్జున ఉన్నాడు. మ‌రి ఇప్పుడెందుకు ఈ క‌ప్ప‌దాటు వ్య‌వ‌హారం? `సినిమా వేదిక‌ల‌పై రాజ‌కీయం మాట్లాడ‌ను` అన్న‌ది నాగ్ మాట‌. సినిమా రేట్ల గురించి, ఓ సినిమా వేడుక‌లో మాట్లాడ‌డం రాజ‌కీయం ఎందుకు అవుతుంది? ఇప్పుడు రాంగోపాల్ వ‌ర్మ గొంతు చించుకుని ట్వీట్లు చేస్తున్నాడు.. అది రాజ‌కీయ‌మా? నాని.. టికెట్ రేట్ల వ్య‌వ‌హారంలో మాట్లాడ‌డం రాజ‌కీయ‌మా?

బంగార్రాజు ఈనెల 14న విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ఏం మాట్లాడితే.. త‌న సినిమాకి ఏమ‌వుతుందో అన్న‌ది నాగ్ భ‌యం కావొచ్చు. ఏపీలో త‌గ్గిన టికెట్ రేట్ల‌తో… క‌చ్చితంగా వ‌సూళ్ల‌లో భారీ మార్పులు క‌నిపిస్తాయి. రావాల్సిన లాభాలు త‌గ్గుతాయి. సినిమా అటూ ఇటూ అయితే.. న‌ష్టాలూ త‌ప్ప‌క‌పోవొచ్చు. వాట‌న్నింటికీ నాగ్ సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమాని ముందే.. జీ సంస్థ‌కు అమ్మేశాడు నాగార్జున‌. ఇప్పుడు లాభాలొచ్చినా, న‌ష్టాలొచ్చినా తన‌కొచ్చిన ఇబ్బందేం లేదు. అందుకే సైలెంట్ గా తప్పుకున్నాడు. కాక‌పోతే.. ప‌రిశ్ర‌మ త‌ర‌పున నిల‌బ‌డి, ప‌రిశ్ర‌మ వైపు నుంచి మాట్లాడాల్సిన త‌రుణంలో.. నాగ్ ఇలా మౌనంగా ఉండిపోవ‌డం, రేటు ఎంతున్నా ఫ‌ర్వాలేదు అన‌డం.. ప‌రిశ్ర‌మ‌కు మేలు చేసే విష‌యం ఎంత‌మాత్రం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close