జనసేనలో కాపు నేతలే ఎందుకు చేరుతున్నారు..?

జనసేన పార్టీకి సంబంధించి.. రాష్ట్రంలో ఎక్కడా కదలిక లేదు కనీ.. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం ఓ మాదిరి నేతలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా చేరుతున్న వారంతా.. ప్రముఖ నేతలైతే కాదు. అలా అని… టీడీపీలోనో.. వైసీపీలోనో.. టిక్కెట్ తెచ్చుకునేంత స్థాయిలో ఉన్న వారు కాదు. కానీ.. టిక్కెట్ కోసం పోటీ పడే స్థాయిలోనే ఉన్నారు. తమకు తాము ఉన్న పార్టీల్లో అవకాశం దక్కదని.. క్లారిటీ వచ్చిన తర్వాత.. వారికి గొప్ప చాయిస్‌గా జనసేన కనిపిస్తోంది. అందుకే.. వెళ్లి ఆ పార్టీలో చేరిపోతున్నారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. ఇలా.. జనసేనలోకి చేరుతున్న వారంతా.. కాపు సామాజికవర్గం నేతలే. ఇతర వర్గానికి చెందిన ఒక్క నేత కూడా.. జనసేన వైపు చూడటం లేదు.

రాజమండ్రికి చెందిన కందుల దుర్గేష్ అనే నేత దగ్గర్నుంచి కాకినాడలో కొద్ది రోజుల క్రితం టీడీపీ తరపున కార్పొరేటర్ గా గెలిచి… మేయర్ పదవి ఇవ్వలేదని.. అప్పుడే తిరుగుబాటు చేసిన.. మాకినీడి శేషుకుమారి అనే నేత వరకూ..అందరూ.. ఒకే సామాజికవర్గం నేతలు. వీరందర్నీ వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో జనసేన పార్టీ… ఒక సామాజికవర్గం వారికే అన్న ముద్ర పడిపోతోంది. ఇప్పటికే.. జనసేనలో అత్యున్నత స్థాయిలో కానీ.. ఇప్పటి వరకూ నియామకాలు జరిపిన స్థాయిలో కానీ… 70 నుంచి 90 శాతం అదే సామాజికవర్గం నేతలు ఉన్నారు. ప్రజల్లోకి ఇదే వెళితే.. అది జనసేన పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడే పరిస్థితి కాదు.

కానీ పవన్ కల్యాణ్ ఈ పరిస్థితిని అంచనా వేస్తున్నారో లేదో ఎవరికీ అర్థం కావడంలేదు. ఎందుకంటే.. జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న ఇతరులు కొంత మందిని కలిసేందుకు కూడా పవన్ కల్యాణ్ ఆసక్తి చూపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరుతామని వస్తున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదట. అయితే.. ఇలా పవన్ నిరాదరణకు గురువుతున్న వారిలో.. కాపు సామాజికవర్గం నేతలు కూడా ఉన్నారు. కానీ… ఇది పరిగణనలోకి రాదు. చేర్చుకుంటున్న వారు… చేరే వారు మాత్రమే పరిగణనలోకి వస్తారు. పవన్ కల్యాణ్ ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే.. ఒక సామాజికవర్గ పార్టీగా జనసేన మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close