చైతన్య : పక్క రాష్ట్రంలో జరిగితే ఆవేశం.. సొంత రాష్ట్రంలో జరిగితే నిర్లక్ష్యం !

ఏపీలో అమ్మాయిలపై.. మహిళలపై ఆకృత్యాలు ఎందుకు పెరిగిపోతున్నాయి ? . తాను పదవి చేపట్టిన తర్వాత హైదరాబాద్‌లో “బైక్ టోల్ కట్టేందుకు వెళ్లిన అమ్మాయి”ని దుండగులు అత్యాచారం చేసి చంపేశారని మనసు చలించిపోయి.. ఏపీలో అలాంటివి జరగకూడదని ఆవేశ పడి మూడు వారాల్లో ఉరిశిక్ష వేసేలా దిశ చట్టాన్ని తీసుకొచ్చారు జగన్. కానీ అక్కడ కంటే ఏపీలో ఇప్పుడు ఘోరాలు ఎక్కువగా జరిగిపోతున్నాయి. ఏ దిశ వారిని ఆదుకోవడం లేదు. మీడియాలో హైలెట్ అయిన వారికి పదో .. పరకో పరిహారం ఇస్తున్నారు. అంతకు మించి రాజకీయం చేస్తున్నారు. అంతే.. బాధితులు మాత్రం బాధితులుగానే ఉండిపోతున్నారు. వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

నేరాలు జరగనిది ఎక్కడ ?

అనంతపురంలో ఓ బ్యాంక్ లో పని చేసుకుంటున్న అమ్మాయిని చంపేసి కాల్చేశారు. ఆ నిందితులేమయ్యారు…? గుంటూరులో చిన్నారిని.. ఓ యువతిని.. ఇలా దారుణంగా హత్యలు చేశారు.? వారేమయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఊళ్లోనూ ఈ మూడేళ్లలో దురాగతాలు బయటపడ్డాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థ విఫలం కావడంతో ఎవరికీ శిక్షలు పడటం లేదు. నిందితుల్ని కులం, మతం, ప్రాంతం కోణంలో చూడటంతోనే అసలు సమస్య వస్తోంది. అలా చూసే పాలకులు ఉండటంతో బాధితులు కూడా బాధితులుగానే మిగిలిపోతున్నారు.

నేరస్తులకు అభయం కల్పిస్తున్న పాలన !

భయం.. భయం .. ఉంటే ఎవరైనా నేరం జరగడానికి భయపడతారని సీఎం జగన్ చెప్పారు. ఆ భయం కల్పించకపోగా అభయం కల్పించినట్లుగా ఉన్నారు ఏపీ పాలకులు. అందుకే నేరస్తులు చెలరేగిపోతున్నారు. నిత్యం ఇలాంటి ఘోరాలు నేరాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేదు..అడ్డూ అదుపూ అసలే లేదు..ఎన్ని రకాల చట్టాలు వచ్చినా, మానవ మృగాల పీడ వదలడం లేదు. ఉన్న చట్టాలకే చిన్నపాటి సవరణలు చేసి వాటికి నిర్భయ, దిశ అని పేర్లు పెట్టినంతనే మహిళలకు రక్షణ కల్పించినట్లు ప్రచారం చేసుకోవడంతోనే సమస్య వస్తోంది. బాధితులకు వేధింపులు.. నేరస్తులకు అభయం కల్పిస్తోంది ఈపాలన.

ప్రచారానికి మాత్రం హద్దే లేదు !

దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు, దిశ యాప్‌ అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రకటనలకు కోట్లు ఖర్చు పెట్టారు. దిశ చట్టం ద్వారా ముగ్గురికి ఉరి వేశామని అప్పటి హోంమంత్రి ప్రకటించి నవ్వులపాలయ్యారు. అసలు ఆ చట్టానికే కేంద్రం ఆమోదం లభించలేదు. ప్రచార్భాటం తప్ప ఆకృత్యాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలే లేవు. దిశ చట్టం ఇంత వరకూ కేంద్రం ఆమోదం పొందలేదు. కానీ దిశ పేరుతో పోలీస్టేషన్లు పెట్టారు. యాప్ తెచ్చి మీట నొక్కితే.. పోలీసులు ఎక్కడ అమ్మాయి ఆపదలో ఉందో గుర్తించి అక్కడికి చేరుకుంటారని ప్రచారం చేశారు. కానీ అంతా ప్రచారానికే పరిమితమైంది. చివరికి ప్రజలు బలవుతున్నారు.

పక్క రాష్ట్రంలో దిశ ఘటన జరిగినప్పుడు ఆవేశపడిన వైనం చూసి.. అహా.. ఓహో అనుకున్నారు. కానీ అసలు పాలన చూసి భయపడాల్సిన పరిస్థితి. చిత్తశుద్ధి లేకుండా ఏం చేసినా అంతే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close