సుష్మపై ఆ నాలుగు విపక్షాలకు ఎందుకో అంత సానుభూతి?

తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు అచ్ఛే దిన్ వచ్చినట్టే. లలిత్ మోడీ వివాదంలో తొలి వికెట్ సుష్మా స్వరాజ్ దే అని అప్పట్లో చాలా మంది భావించారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉంటూ, లలిత్ యూకే వీసా పొందడానికి సహాయం చేసిన సుష్మా వ్యవహారం దుమారం రేపింది. లలిత్ భార్యకు క్యాన్సర్ సర్జరీ చేయాల్సి ఉండటంతో మానవత్వంతో సహాయం చేశానని సుష్మా ఒప్పుకున్నారు. దీంతో ఆమె అక్రమాలకు పాల్పడలేదని దేశంలో చాలా మంది ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దుమ్మెత్తి పోశాయి.

ఈ నెల 21 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో లలిత్ మోడీ అంశంపై సభ దద్దరిల్లడం ఖాయమంటున్నారు. అయితే, సుష్మాను ఇబ్బంది పెట్టవద్దని నాలుగు కీలక ప్రతిపక్షాలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్, ములాయం సింగ్ పార్టీ సమాజ్ వాదీ పార్టీ, శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నితీష్ కుమార్ కు చెందిన జనతా దళ్ యునైటెడ్ లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భోగట్టా. ఈ నాలుగు పార్టీ నాయకులూ తమ ఫోన్ సంభాషణల్లో దీనిపై ఓ అంగీకారానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

మొదటి నుంచీ సుష్మా స్వరాజ్ నడవడికే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని సమాచారం. దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సుష్మా, ఎప్పుడూ హుందాగా వ్యవహరించారని, వివాదాల జోలికి పోలేదని పేరుంది. ప్రతిపక్ష నాయకులతోనూ పరుషంగా మాట్లాడిన సందర్భాలు లేవు. సైద్ధాంతిక విమర్శ తప్ప, ఆమె ఎప్పుడూ తమను వ్యక్తిగతంగా విమర్శించలేదని ఈ పార్టీల నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. విపక్షాల వారితోనూ మర్యాదగా మెలగుతూ సత్సంబంధాలు కొనసాగించడం ఇప్పుడు సుష్మాకు కలిసివచ్చింది.

లోక్ సభలో లలిత్ మోడీ అంశంపై రగడ జరిగేటప్పుడు, సభను స్తంభింప చేసే సమయంలో సుష్మా ప్రస్తావనను తేవద్దని ఈ పార్టీలు భావిస్తున్నాయి. వసుంధర రాజె, ఇతరుల గురించి మాత్రం ప్రస్తావిస్తారు. అయితే కాంగ్రెస్ మాత్రం యథావిధిగా సుష్మాతో సహా బీజేపీ వారందరిపైనా విమర్శల దాడి చేయబోతోంది. ప్రధాని మోడీపై లక్ష్యంగా చేసుకుని పార్లమెంటులో దాడి చేయబోతోంది. దీంతో ఉభయ సభలూ దద్దరిల్లబోతున్నాయని విపక్షాలు ముందే చెప్తున్నాయి. సుష్మా వరకూ ఇబ్బంది లేకపోయినా, మొత్తానికి విపక్షాల దాడిని మోడీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close