దోచుకుంటున్నారని తిడుతున్నా.. టాలీవుడ్‌లో ఎవరికీ రోషం రావడం లేదా!?

సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాని స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకంగా స్పందించేవారే ఎక్కువగా ఉన్నారు. ఆయనపై వైసీపీ నేతలు..క్యాడర్ మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. వైసీపీ తరహా ఎదురుదాడి జరుగుతోంది. దీన్ని నాని పట్టించుకుంటారా లేదా అన్న సంగతి తర్వాత కానీ… టిక్కెట్ల వివాదంపై స్పందించడానికి మరో టాలీవుడ్ ప్రముఖుడికి మనసు రాలేదు. గతంలోప వన్ కల్యాణ్ స్పందిస్తే ఆయనను ఒంటరిని చేశారు. అప్పుడు కూడా నానిమద్దతిచ్చారు. కానీ ఇప్పుడు నాని మాట్లాడితే ఎవరూ బయటకు రావడం లేదు.

ఓ చిన్న హీరో మాట్లాడితే తాము మద్దతుగా రావడం అనేకంటే..తాము కూడా సొంతంగా గళం విప్పవచ్చు కదా అన్న ప్రశ్నలువస్తున్నాయి. టిక్కెట్ల వివాదంపై తమిళ హీరో సిద్ధార్థ స్పందించారు. నిజానికి సిద్ధార్థ తెలుగు సినిమాలు చేస్తున్నది తక్కువే.కానీ సిద్ధార్థది స్పందించే గుణం. గతంలో బీజేపీ నేతలను కూడా విమర్శించారు. ఇప్పుడు కూడా స్పందించారు. అలాంటి స్పందించే గుణం టాలీవుడ్‌లో ఇంకెవరికీ లేకుండా పోయింది. మంత్రులు బొత్స, అనిల్, కన్నబాబు లాంటి వాళ్లు టిక్కెట్ రేట్లతో దోచుకుంటున్నారని అదే పనిగా అంటున్నా ఒక్కరూ నోరు తెరవలేకపోతున్నారు.

ఇండస్ట్రీని ఇంత దారుణంగా టార్గెట్ చేస్తున్నా… ఎందుకు స్పందించలేకపోతున్నారో ఎవరికీ అర్థంకావడం లేదు. వారి ఆస్తులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలోలేదు. అయినా కానీ టాలీవుడ్ పెద్దలు ఎందుకు భయపడుతున్నారో ఎవరికీ అర్థంకావడం లేదు. ఇన్నాళ్లు తాము ఎదిగిన ఇండస్ట్రీని హీరోచితంగా కాపాడుకోకపోతే.. ఇప్పటి వరకూతెచ్చిపెట్టుకున్న హీరో ఇమేజ్‌లు ఎందుకూ పనికి రావని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close