అమరావతిపై బీజేపీ మద్దతుకు టెస్టింగ్ టైమ్ !

అమరావతి రైతులు మహా పాదయాత్ర ప్రారంభించారు. ఈ సారి పాదయాత్రకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రాజ్యాంగం సహా చట్టం, న్యాయం మొత్తం రైతులకు అనుకూలంగా ఉంది. అయినా వేటినీ లెక్క చేయబోమని చెబుతున్న ప్రభుత్వం మూడు రాజధానులు ఖాయమని రెచ్చ గొడుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా.. అమరావతకే తమ మద్దతు అని ప్రకటించి ఆ ప్రాంతంలో పాదయాత్ర కూడా చేసిన పార్టీగా బీజేపీ పాత్ర ఇప్పుడు కీలకం కాబోతోంది. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునే కుట్రలు కూడా జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి సమయంలో బీజేపీ తాము అమరావతికి అండగా ఉంటామని నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పట్లాగే.. అమరావతికి మద్దతు.. రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం అని కబుర్లు చెబితే… రైతులు నమ్మరు ఇప్పటికీ జగన్‌తో కలిసి వారు తమను రోడ్డున పడేశారని రైతులు గట్టిగా నమ్ముతున్నారు. సోము వీర్రాజు పాదయాత్రలో నేరుగా నిలదీశారు కూడా. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా పార్లమెంట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని చంద్రబాబు ప్రకటించారు.

ఈ క్రమంలో అమరావతి రైతులపై.. పాదయాత్రపై ఎలాంటి కుట్రలు జరిగిన తిప్పికొట్టేలా అండగా ఉండాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉంది. అరాచకానికి కేరాప్ అడ్రస్‌గా ఉన్న ఏపీప్రభుత్వం ఏంచేయడానికైనా వెనుకాడదని ఇప్పటికే అనేక రకాల ఉదాహరణలు వెలుగుచూశాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చట్టాలను.. రాజ్యాంగాలను ఉల్లంఘించాలని చూసినా సైలెంట్‌గా ఉంటే.. ఇక బీజేపీకి ప్రజలు ఎవరూ నమ్మలేరు. అందుకే ఓ రకంగా అమరావతి రైతుల పాదయాత్ర బీజేపీకి టెస్టింగ్ టైమ్ అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close