పోలవరంలో దొంగాట..! కేంద్రం నిధులెందుకు ఇస్తుంది..!?

పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. అంటే కేంద్ర ప్రభుత్వ ఆస్తి. కానీ నిర్మాణ బాధ్యత మాత్రం ఏపీ సర్కార్‌పై ఉంది. అలా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా కాంట్రాక్టర్లను మార్చేసి.. ప్లాన్లు మార్చేసి.. ఎత్తిపోతల పథకాలకు ఆమోద ముద్ర వేసి.. .. అంతా మా ఇష్టం అనుకున్నట్లుగా చేస్తామంటే కేంద్రం ఎందుకు ఊరుకుంటుంది..?. ఇప్పుడు అదే జరుగుతోంది. పోలవరం విషయంలో కేంద్రం నుంచి పైసా రావడంలేదు. అయినా ఏపీ సర్కార్ మాత్రం.. ఈ తరహా చర్యలు ఆపడం లేదు.

జాతీయ ప్రాజెక్టుపై ఇష్టారీతిన రాష్ట్రం నిర్ణయాలు..!

పోలవరానికి సంబంధించిన పనులన్నీ పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ చేతుల మీదుగా సాగాలి.కానీ ప్రభుత్వం అన్నీ ఏకపక్షంగా చేసుకుంటూ వెళ్తోంది. నిర్ణయాలు తీసుకుటోంది. మొదట రివర్స్ టెండరింగ్‌కు వెళ్లినప్పుడు పీపీఏ అనుమతి తీసుకోలేదు. దీంతో పీపీఏ ఆ రివర్స్ టెండరింగ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పనుల ఖర్చు తగ్గించామంటూ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. రూ.780 కోట్లను ఆదా చేశామంటూ చెప్పుకొచ్చారు. తాజాగా రూ.1656.61 కోట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులోనే ఈ అంచనాల పెంపు కేంద్ర జల సంఘం ఆమోదానికి లోబడి ఉంటుందని జలవనరుల శాఖ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. అంటే ఆమోదం లేకుండానే ఉత్తర్వులిచ్చేశారన్నమాట.

అంచనాలు పెంచితే సంబంధం లేదని రివర్స్‌లోనే చెప్పిన కేంద్రం..!

వాస్తవానికి పోలవరం సాగు నీటి ప్రాజెక్టుకు రివర్స్ టెండరుకు వెళ్తున్నప్పుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ వ్యయం పెరగడంతో సహా .. నిర్ణీత లక్ష్యం మేరకు ప్రాజెక్టును పూర్తి చేయలేమని కేం ద్రం వెల్లడించింది. నవయుగ సంస్థ వేగంగా … నాణ్యతతో పనులు చేపడుతున్నందున .. రివర్స్ టెండరింగ్ కు వెళ్లకుండా ఉంటే .. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అంచనా వ్యయం పెరిగితే రాష్ట్రమే భరిం చాలని కూడా జగన్ సర్కారుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చిచెప్పింది. అయినా ఇప్పుడు… కేంద్రం రీఎంబర్స్ చేస్తుందని.. జీవో ఇచ్చారు.తాజాగా అంచనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం అంగీకరించే పరిస్థితి లేదు.

ఇప్పుడు ప్రజాధనం దోచిపెట్టడానికే కొత్త కథలు..!

పోలవరం ఖర్చును రీఎంబర్స్ చేయడానికే ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది.. సవరించిన అంచనాలను ఆమోదించడానికి అంగీకరించడం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఓ జీవో ఇచ్చినంత మాత్రాన.. కేంద్రం పెంచిన నిధులు ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి. ఎందుకంటే… కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఆ తర్వాత కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. ఇప్పటికే పోలవరం కోసం చేసిన ఖర్చులంటూ పంపిన బిల్లులపై అనేక కొర్రీలు పెట్టి.. తగ్గించి ఇస్తోంది. ఇప్పుడు తమంతట తాముగా పెంచుకుని ఖర్చు పెట్టేసుకున్నామని చెబితే కేంద్రం పైసా కూడా ఇవ్వదు. ఆ నిధులను రాష్ట్ర ప్రజల నుంచి పన్నుల రూపంలోనే వసూలు చేసి.. కాంట్రాక్టర్‌కు కట్టాలి. అంటే… పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారం మొత్తం చివరికి ప్రజాధనానికి టెండర్ పెట్టడం అన్నట్లుగా మారిపోయిందన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close