మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ మేనిఫెస్టోలో ఏముందన్న సంగతి పక్కన పెడితే ఎగ్గొట్టిన హామీలు.. ఎందుకు అమలు చేయలేదన్న విషయాలను కూడా వివరించాల్సి ఉంది. కానీ అలా చెప్పే ధైర్యం లేక వదిలి పెట్టేశారు.

జగన్మోహన్ రెడ్డి తనకు మనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అయితే మద్య నిషేధంపై ఖచ్చితంగా సమాధానం చెప్పి ఉండేవారు. మూడుదశల్లో మద్యాన్ని నిఫేధించి.. ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని బైబిల్ లో రాసుకొచ్చారు. మద్య నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని సవాల్ చేశారు. మరి ఓట్లకు వెళ్లే ముందు ఎందుకు ఆ విషయంపై మాట్లాడటం లేదు. ఎందుకు చేయలేకపోయారో చెప్పడం లేదు. అదొక్కటేనా ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ , రాగానే మెగా డీఎస్సీ అన్నారు. ఐదేళ్లలో ఒక్క సారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. టీచర్ల పోస్టుల భర్తీ లేదు. ఎందుకు చేయలేకపోయారో చెప్పాలి కదా !

Also Read : మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

” అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు ” అన్నారు. అవగాహన లేదని చీఫ్ సలహాదారులో చీఫ్ మినిస్టర్ చెప్పించారు. అలా అయితే రాజీనామా చేసి వెళ్లిపోవాలి కదా! అగ్రిగోల్డ్ బాధితులకూ రూ. 1150 కోట్లు ఇవ్వడం దగ్గర్నుంచి ఎస్సీ, ఎస్టీలు సహా అనేక పథకాలను స్వయంగా మేనిఫెస్టోలో ప్రకటించినా జగన్ఇవ్వలేదు. రైతులకు రూ. 12500 ఒకే సారి మే నెలలో ఇస్తామన్నారు. మరోసారి గెలిస్తే పదివేలు.. మిగిలిన ఆరు వేలు కేంద్రం ఇస్తుందట.

Also Read: మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

మేనిఫెస్టోను పక్కన పెడితే పాదయాత్రలో ఇచ్చిన హామీల సంగతి చెప్పాల్సిన పని లేదు. అవి ఒక ఐదు వందలకుపైగా ఉంటాయి. వాటిపైనా సమాధానం లేదు. ఇలాంటి రాజకీయాన్ని ప్రజలు హర్షించరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గతానికి భిన్నంగా ఎన్నికలు… ఏపీ ప్రజల మద్దతు ఎవరికీ..?

ఈసారి ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగబోతున్నాయి. వైసీపీ - కూటమి పార్టీల మధ్య నువ్వా- నేనా అనే తరహాలో బిగ్ ఫైట్ నడిచింది. డీ అంటే డీ అనే స్థాయిలో ప్రచార పర్వం...

ఏపీలో ఇంత డబ్బు.. నోట్లు ఎలా ?

ఏపీలో నోట్ల విశ్వరూపం కనిపిస్తోంది. ప్రతీ పార్టీ ఓటర్‌కు డబ్బులు పంపుతోంది. ప్రతి ఓటర్ కు నాలుగు ఐదు వందల నోట్లు చేరుతున్నాయి. యావరేజ్ గా .. ఓటుకు రెండు వేలు ఖచ్చితంగా...

తల్లి సపోర్టూ లేని జగన్ – షర్మిలను గెలిపించాలని విజయలక్ష్మి పిలుపు

జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయారు. చివరికి తన తల్లి సపోర్టును కోల్పోయారు. వైసీపీని ఓడించి తన కుమార్తె షర్మిలను గెలిపించాలని ఆమె అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు....

స్నేహితుడి కోసమే అర్జున్ – కానీ వాడేసిన వైసీపీ

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కలకలం రేపింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదురీదుతూండటంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close