ఎన్నికల బరిలోకి కోదండరాం..! సక్సెస్ అవుతారా..?

తెలంగాణ జన సమితీ అధ్యక్షుడు కోదండరాం… ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. మరో ఆరు నెలల్లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.వీటిలో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కోదందరాం బరిలోకి నిలిచే అవకాశం ఉంది. మరో స్థానం హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి కూడా మరో అభ్యర్థిని రంగంలోకి దించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కోదండరాం నేరుగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ.. టీజేఎస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మాత్రం… ఈ విషయంలో.. నిర్ణయానికి వచ్చేసింది.

తెలంగాణ ఉద్యమంలో కోదండరాంది కీలక పాత్ర. ఆయన జేఏసీ అధ్యక్షునిగా కీలక కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని కేసీఆర్ అనుమతి లేకుండానే నిర్వహించారు. అన్నీ సక్సెస్ అయ్యాయి. అన్ని పార్టీను ఏకతాటిపై ఉంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయనకు ప్రాధాన్యం తగ్గింది. ఇతర ఉద్యమకారులు పదవులు పొంది.. మంత్రులు కూడా అయ్యారు. కానీ కోదండరాం మాత్రం.. ఎలాంటి టిక్కెట్లు కానీ.. పదవులు కానీ ఆశించలేదు. కేసీఆర్ ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లుగా చెబుతూంటారు. తర్వాత రాజకీయ పార్టీ పెట్టారు. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా ఉన్నారు.

తెలంగాణకు జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగాం నుంచి పోటీ చేయాలని కూడా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పట్టుబట్టి మరీ తన సీటును తాను కేటాయింప చేసుకున్నారు. ఫలితంగా కోదండరాం ఎక్కడా పోటీ చేయలేకపోయారు. ఇప్పుడు.. ఎమ్మెల్సీగా బరిలోకి దిగడం మాత్రం ఖాయమే. పట్టభద్రులు… ప్రలోభాలకు లొంగరు. గతంలో అనేక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. దీన్ని రుజువు చేశాయి. దీంతో.. ఎమ్మెల్సీ స్థానంలోకి బరిలోకి దిగితే విజయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కోదండరాం ఎమ్మెల్సీగా గెలిచి వస్తే.. తెలంగాణ రాజకీయంలో మార్పు ప్రారంభమైనట్లేనని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close