ఏడు మండలాల్ని తిరిగి ఇచ్చేస్తారా..!?

పోలవరం ముంపు మండలాలపై మళ్లీ చర్చ ప్రారంభమయింది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ… పోలవరం ఎత్తు తగ్గించాలనే ఆలోచన చేస్తోంది. కేంద్ర జలసంఘం ఆమోదించిన ఎత్తు మేరకు నీరు నిల్వ చేస్తే.. రూ. 30వేల కోట్లు పునరావాసానికి కావాలి. అంత పెద్ద మొత్తంలో నిధులులేవు కాబట్టి… 41 మీటర్లకుతగ్గించాలనే ఆలోచన ఏపీ సర్కార్ చేస్తోంది. అదేజరిగిదే…ఏపీలో కలిపిన ఏడు ముంపుమండలాల్లో ముంపు ఉండదు. అక్కడ పరిహారం చెల్లించాల్సిన అవసరం రాదు. కేవలం పోలవరం ప్రాజెక్ట్ వద్ద మునుగుతాయన్న ఉద్దేశంతో… భవిష్యత్‌లో రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన గొడవలు వస్తాయన్న ముందుచూపుతో.. ఆ ఏడు మండలాల్ని ఏపీలో కలిపారు. ఇప్పుడు ముంపు లేకపోతే.. ఆ ఏడు మండలాలను ఏపీలో ఉంచాల్సిన అవసరం ఉండదనేది చాలా మంది వాదన.

ఏడు మండలాలను అక్రమంగా కలిపేసుకున్నారని.. చాలా రోజులుగా.. టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూ తెలంగాణ ప్రాంతంలోని ఏడు ముంపు మండలాలను….2014లో ఏపీలో కలిపింది కేంద్రం. ఈ విలీనాన్ని తెలంగాణ ఉద్యమ సంఘాలు, టీఆర్ఎస్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లోనే రాముడి ఆలయం ఉన్న భద్రాచలం గ్రామాన్ని ఏపీలో విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ భావోద్వేగాల ప్రాతిపదికన…భద్రాచలం గ్రామాన్ని విలీనం నుంచి మినహాయించారు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు..భద్రాచలం కూడా ఏపీదేనని.. తమకు ఇచ్చేయాలని వాదిస్తూ ఉంటుంది. అదో రాజకీయవివాదంలా ఉండిపోయింది.

ముంపులేకపోతే.. ఏడు మండలాలను.. తమకు ఇచ్చేయాలని తెలంగాణ పట్టుబట్టకుండా ఉండదు. కేంద్ర స్థాయిలో పోరాటం చేస్తుంది. అవసరం లేనప్పుడు తెలంగాణ ఇచ్చేస్తే ఏమవుతుందని ఏపీ సర్కార్ అనుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఏపీ సర్కార్ వ్యవహారశైలి అంతే ఉంది. త్వరలో దీనికి సంబంధించి అడుగులు ముందుకుపడినా ఆశ్చర్యం లేదనే వాదన రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఆ ఏడు మండలాలు వెనక్కిపోతే.. ఇప్పుడు కాదు.. ఇక ఎప్పటికీ పోలవరం కలగానే మిగిలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close