ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా?

లేడీ యాంక‌ర్ల‌లో సుమ‌…ఓ సూప‌ర్ స్టార్ అయితే, మ‌గ యాంక‌ర్ల‌లో ప్ర‌దీప్ మాచిరాజు అంత‌టి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో అత్యంత బిజియెస్ట్ యాంక‌ర్ త‌నే. ఇప్పుడు హీరోగానూ మారాడు. `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా` సినిమాతో. మున్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అమృత అయ్య‌ర్ హీరోయిన్‌. ఈనెల 29న విడుద‌ల అవుతోంది.

నిజానికి లాక్ డౌన్ కంటే ముందు రావాల్సిన సినిమా ఇది. థియేట‌ర్ల మూత వ‌ల్ల కుద‌ర్లేదు. ఈలోగా.. ఈ సినిమాకి చాలా ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఫ్యాన్సీ రేట్ల‌కు కొన‌డానికి ఆహా, జీ5 లాంటి సంస్థ‌లు ఉత్సాహం చూపించాయి. అయితే నిర్మాత‌లు మాత్రం ఈ సినిమాపై భ‌రోసా ఉంచి, థియేట‌ర్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా విడుద అవుతోంది. ఆడియో ప‌రంగా `నీలి నీలి ఆకాశం.. ఇద్దామ‌నుకున్నా` పాట సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌యిపోయింది. ఈ సినిమాపై జ‌నాల ఫోక‌స్ పెర‌గ‌డానికి ఆ పాటే కార‌ణం. పైగా ప్ర‌దీప్ హీరోగా ఏం చేస్తాడో, చూడాల‌నుకుంటోంది చిత్ర‌సీమ‌. ఈ సినిమా హిట్ట‌యితే.. ప్ర‌దీప్ తో సినిమాలు చేయ‌డానికి ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌లు రెడీగా ఉన్నారు. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వ‌చ్చినా, మ‌రో రెండు సినిమాల్లో ప్ర‌దీప్ హీరోగా బుక్క‌యిపోవ‌డం ఖాయం. ఫిమేల్ యాంక‌ర్ల‌లో.. ఎంత‌మంది ఉన్నా.. అన‌సూయ మాత్ర‌మే సినిమాల్లో రాణిస్తోంది. మెయిల్ యాంక‌ర్ల‌కు ఆ అవ‌కాశ‌మే లేదు. ఇదివ‌ర‌కు కొంత‌మంది యాంక‌ర్లు హీరోలుగా అవ‌తారం ఎత్తారు. వాళ్లంద‌రికీ నెగిటీవ్ రిజ‌ల్టే వ‌చ్చింది. ప్ర‌దీప్‌.. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి. ఈ సినిమా గ‌నుక హిట్ట‌యితే.. ప్ర‌దీప్ జాత‌క‌మే పూర్తిగా మార‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close