ఎక్కడికెళ్లినా ఒంటరిగానే విజయసాయిరెడ్డి – వైసీపీలో ఉన్నట్లా .. లేనట్లా ?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఎవరూ కలవొద్దని వైసీపీ హైకమాండ్ తమ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత అయిన విజయసాయిరెడ్డి ఎక్కడకు వెళ్లినా ఒంటరిగా వెళ్తున్నారు. తాజాగా ఆయన బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. విశాఖ అభివృద్ధి పనుల కోసం కలిసినట్లుగా చెబుతున్నారు. నిజానికి విశాఖలో ఇన్వెస్ట్ మెంట్స్ సదస్సు నిర్వహిస్తున్నారు. అ ప్రాంతంలో వైసీపీ తరుపున అనధికారిక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి పిలుపు లేదు.

దేశవ్యాప్తంగా ప్రముఖ పెట్టుబడిదారులతో ఆయనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే పలు రాష్ట్రాల్లో నిర్వహించిన రోడ్ షోలకు పిలువలేదు. చివరికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు వెళ్లిన టీమ్‌లోనూ… విజయసాయిరెడ్డి లేరు. ఇటీవల గవర్నర్ ను కూడా ఆయన ఒంటరిగానే కలిశారు. విజయసాయిరెడ్డి ఇలా ఒంటరిగా పార్టీ ముద్ర లేకుండా రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఢిల్లీలో వైసీపీలో ఏం జరుగుతోందన్న చర్చ జరుగుతోంది.

అదే సమయంలో విజయసాయిరెడ్డి.. పీఎం కిసాన్ పథకానికి మీట నొక్కుతున్న సమయంలో… చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. జగన్ ఇప్పుడు మీట నొక్కుతున్నారు కానీ.. ఒక రోజు ముందే అకౌంట్లలో ప్రధాని మోదీ నిధులు జమ చేశారని.. చెప్పేలా ఆ ట్వీట్ ఉంది. దాంతో అది వైరల్ అయింది. విజయసాయిరెడ్డి విషయంలో బయట జరుగుతున్న దాని కన్నా .. తీవ్రమైన వ్యవహారం ఏదో అంతర్గతంగా జరుగుతోందన్న అభిప్రాయం వైసీపీలో బలపడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close