రాజధాని దళిత రైతుల నుంచి స్థలాలు వెనక్కి..? నోటీసులు జారీ..!

అమరావతికి భూములిచ్చిన రాజధాని దళిత రైతులు అనుకున్నంత అవుతోంది. అసైన్డ్ భూముల పేరుతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఇళ్ల స్థలాల కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని.. సెంట్ చొప్పున పంపిణీ చేసిన ప్రభుత్వం.. అమరావతిలో దళిత రైతుల వద్ద మాత్రం తీసుకోలేకపోయింది. దీనికి కారణం.. అసైన్డ్ భూములయినప్పటికీ.. ఇతర పట్టా భూముల్లాగే అన్ని హక్కులు దళిత రైతులకు కల్పిస్తూ.. అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే. కొంత కాలంగా దళితుల భూముల కేంద్రంగా వివాదం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి… ఎవరూ ఫిర్యాదు చేయకుండానే… భూములు పరాధీనం అయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది.

అయితే రాజధాని దళిత రైతులు మాత్రం తమ భూమి తమ దగ్గరే ఉందని.. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మేరకు.. ఇష్ట పూర్వకంగానే ఇతరులకు అమ్ముకున్నామని అయితే.. ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు కూడా తమ పేరుపైనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూండగానే.. అస్సైన్డ్‌ రైతులు కొందరికి అధికారులు నోటీసులు జారీ చేశారు. మీకు నివాస, వాణిజ్య ఫ్లాట్ల కేటాయింపును రద్దు చేసి, వాటిని ఎందుకు వెనక్కు తీసుకోకూడదో 15 రోజుల్లోగా చెప్పాలని, లేకపోతే తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధారాల్ని బట్టి ఫ్లాట్ల కేటాయింపు రద్దు చేస్తామని నోటీసుల్లో తెలిపారు. అసైన్డ్ రైతుల్లో ఆరు కేటగిరీలు ఉన్నాయి. వీరిలో ఓ కేటగిరీ కింద ఉన్న రైతులకు ప్రస్తుతం నోటీసులు జారీ చేశారు.

ఒకరి తర్వాత ఒకరు.. మొత్తంగా దళిత రైతులందరికీ ఈ నోటీసులు జారీ చేస్తారని.. వారికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ వైసీపీ నేతల వ్యూహం దీని కోసమే నడుస్తోందని.. ఫైనల్‌గా అమలు చేస్తున్నారని రాజధాని రైతులు అనుమానిస్తున్నారు. దళితుల భూములపై కన్నేసి.. వారి కోసం పోరాడుతున్నట్లుగా నటిస్తూ… మొత్తం అమరావతిపై కుట్ర చేశారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం ముందు ముందు మరింత ముదిరే అవకాశం ఉంది. రాజకీయ రచ్చ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close