వికారాబాద్ వద్ద రైల్వే ట్రాక్పై కారుతో దూసుకెళ్లిన యువతి వ్యవహారం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా వీడియో వైరల్ అయింది. అలా కారులో ఆ యువతి వెళ్తూండటంతో చాలా మంది టెర్రరిస్టు అనుకుని మధ్యలో పట్టుకుని తాళ్లతో కట్టేశారు. పోలీసులు విడిపించుకుని తీసుకెళ్లారు. ఆమె గురించి వివరాలు ఆరా తీస్తే.. చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తరాది రాష్ట్రానికి చెందిన యువతి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది.ఇటీవల ఆమె ఉద్యోగం పోయింది. ఈ క్రమంలో ఒత్తిడికి గురయింది. ఏదో అంశంపై ఫిర్యాదు చేయడానికి శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోక ముందే వెళ్లిపోయింది. ఆ తర్వాత కారులో నేరుగా రైల్వే ట్రాక్ పైకి ఎక్కింది. పోలీస్ స్టేషన్ లో ఆమె బ్యాగ్ మర్చిపోవడంతో పోలీసులు కూడా వెదుకుతున్నారు. అప్పుడే వారికి సమాచారం రావడంతో అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంలోనే ఆ యువతి అలా వెళ్లిందని భావిస్తున్నారు. అయితే అందరూ రీల్స్ కోసమని ప్రచారం చేశారు. కానీ ఆమె రీల్స్ కోసం ఆ పని చేయలేదు. వీడియోను కూడా తీసుకోలేదు. మానసికంగా డిస్ట్రబ్ర్ అయి ఉందని పోలీసులు గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ యువతి ఇలా చేయడం వల్ల చాలా రైళ్లు ఆలస్యమయ్యాయి.