ఇప్పుడు కాలం మారింది. పెళ్లి పేరుతో మగాళ్లు మోసం చేసే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడపిల్లలు మోసం చేసే రోజులు వచ్చాయి. అవి ప్రేమించి మోసం చేయడాలు అయితే .. మామూలే అనుకోవచ్చు కానీ..అచ్చంగా మోసం చేయడానికే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
కర్ణాటకలో ఓ పెళ్లి కాని ప్రసాద్ .. పెళ్లి కోసం ఎన్నో సంబంధాలు చూసుకున్నా కుదర్లేదు. మధ్యవర్తుల ద్వారా విజయవాడలో అమ్మాయి ఉందని తెలుసుకుని వచ్చారు. మధ్యవర్తులు విజయవాడ దుర్గగుడిలోనే పెళ్లి చేశారు. ఎదురు కట్నాలు.. ఇతర విధంగా అందినంత సొమ్ము తీసుకున్నారు. తర్వాత వెళ్లిపోయారు. ఆ పెళ్లి కూతురు కూడా హఠాత్తుగా కనిపించకుండా పోయింది. దాంతో వారంతా పోలీసుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అసలు విషయం కనిపెట్టారు.
ఆ పెళ్లి కుమార్తె కుమార్తె కాదు ముగ్గురు పిల్లల తల్లి. పెళ్లి కుమార్తెలాగా నటిస్తే యాభై వేలు ఇస్తామని చెప్పడంతో అంగీకరించానని మూడు రోజులు నటించి తన దారిన తాను వచ్చానని అమె పోలీసులకు చెప్పడంతో వారి మైండ్ బ్లాంక్ అయింది. అయితే ఆమె అసలు మోసం చేసే ముఠాతో కలిసి పని చేస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ముఠా కోసం గాలిస్తున్నారు.
అటు పరువు పోయి.. ఇటు డబ్బులు కూడా పోయిన ఆ పెళ్లి కుమారుడు.. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆతని బాధ చూసిన ఎవరికైనా మగజాతికి ఇంత కష్టం వచ్చిందేమోటని జాలి పడకుండా ఉండలేరు.