కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

“ప్రతిపక్షాలలో మాట వినని వారి పని పట్టమని కేంద్రం తమను ఆదేశించినట్లు నాకు ఒక సీబీఐ అధికారి నిన్న చెప్పారు,” అని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ మెసేజ్ పెట్టడం కలకలం సృష్టిస్తోంది. అధికారంలో ఉన్నవాళ్ళు తమ రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయడానికో లేక లొంగ దీసుకోవడానికో దర్యాప్తు సంస్థలను ఈవిధంగా దుర్వినియోగించడం కొత్త విషయమేమీ కాదు. కానీ ఆ విషయాన్నీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈవిధంగా బహిర్గతం చేయడమే విశేషం. కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యల వలన ఆయనే చిక్కులో పడే అవకాశం ఉంది.

డిల్లీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సిబిఐ అధికారులు దాడులు చేసినప్పటి నుండి కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంటే ఆయనకి జవాబు చెప్పుకోలేక కేంద్రం చాలా ఇబ్బంది పడుతోంది. కానీ ఇప్పుడు ఆయనే కేంద్రప్రభుత్వానికి ఒక మంచి ఆయుధం అందించినట్లయింది. ఆయనతో ఆ మాట అన్న సిబీఐ అధికారి పేరు చెప్పమని కేంద్రం ఒత్తిడి చేసినట్లయితే కేజ్రీవాల్ చాలా ఇరకాటంలో పడతారు. చెపితే సదరు అధికారి ఉద్యోగం ఊడే ప్రమాదం ఉంది చెప్పకపోతే కేజ్రీవాల్ అబద్ధాలు చెపుతున్నారనే బీజేపీ వాదనకు బలం చేకూరుతుంది. అయితే దేనిని తెగే వరకు లాగకూడదనే విషయం మరిచిపోయి ఈ వ్యవహారాన్ని కేజ్రీవాల్ అనవసరంగా ఇంకా సాగదీస్తున్నట్లు కనబడుతోంది. దాని వలన ఊహించని సమస్యలు ఎదురయితే అప్పుడు వాటి నుండి బయటపడేందుకు మరో కొత్త యుద్ధం ఆరంభించవలసి వస్తుంది. ఇటువంటి విషయాలలో ఎంతవరకు వెళ్ళాలనే విషయంపై ఆయన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహా తీసుకొంటే మంచిదేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close