మరిప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారో?

“రాజధాని ప్రాంతంలో రైతుల మీద భూసేకరణ చట్టం ప్రయోగించవద్దు, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళమని” జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్ననే హెచ్చరించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో నిర్వహించిన సీ.ఆర్.డి.ఏ.సమావేశంలో ఈనెల 20 నుంచి భూసేకరణ జరపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశంలో భూసేకరణ, రాజధాని నిర్మాణ దశలు, దానికి అవసరమయిన నిధుల సమీకరణ, రైతులకు, రైతు కూలీలకు చెల్లింపులు మొదలయిన అనేక ముఖ్యమయిన అంశాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వర రావు, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, సీ.ఆర్.డి.ఏ. కార్యదర్శి అజయ్ జైన్, కమీషనర్ శ్రీకాంత్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగించి ఈ నెల 20నుండి రైతుల భూమిని స్వాధీనం చేసుకోవాలనుకొంటోంది కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానిపై ప్రతిస్పందించక తప్పదు. ఎందుకంటే ఆయనే స్వయంగా దీని ప్రసక్తి ఎత్తారు కనుక. ఒకవేళ ఇప్పుడు కూడా ఆయన మౌనం వహిస్తే ఆయన చేస్తున్న ట్వీట్ మేసేజులకి అర్ధం ఉండదు. ఒకవేళ ఆయన మౌనం వహించినా ఇటువంటి అవకాశం కొరకే ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలు భూసేకరణ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చును. ఇప్పటికే కొందరు రైతులు హైకోర్టునాశ్రయించి స్టే ఆర్డర్లు పొంది తమ భూముల్లో యదాప్రకారం పంటలు సాగు చేసుకొంటున్నారు. కనుక వారి నుండి భూమి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే ముందు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా హైకోర్టు అనుమతి పొందవలసి ఉంటుంది. కానీ మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టంలో చేసిన కొన్ని సవరణల వలన రైతుల నుండి భూమి స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండబోదు. కానీ ఈ న్యాయ పోరాటాల వలన కొంత కాలయాపన మాత్రం తప్పకపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close