విచారణ పూర్తయితే కాంగ్రెస్ లో సగం మంది జైలుకే పోతారుట!

ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసల మధ్య ఇందిరమ్మ ఇళ్ళు అంశంపై జరుగుతున్న మాటల యుద్ధంలో చాలా ఆసక్తికరమయిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజలను ఆదుకొంటుందని అందరూ ఆశిస్తే తమ హయాంలో పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ తాలూకు బిల్లులు నేటికీ చెల్లించకుండా తెరాస ప్రభుత్వం త్రొక్కి పట్టి ఉంచిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెరాస ప్రభుత్వం వాటిని మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీకే మంచిపేరు, ప్రజలలో ఆదరణ పెరుగుతుందనే భయంతోనే ఏడాది గడిచినా ఇంకా బిల్లులు చెల్లించకుండా పేద ప్రజలని ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు.
ఒక ప్రభుత్వం మంజూరు చేసిన పధకాలను మరొక ప్రభుత్వం కొనసాగించినప్పుడే ప్రజలకు ప్రభుత్వాల మీద విశ్వాసం నిలుస్తుంది. కానీ ప్రభుత్వాలు మారగానే పేదల చేతిలో ఉన్నదానిని కూడా వారికి దక్కకుండా చేస్తే ప్రభుత్వాల మీద ప్రజలు నమ్మకం కోల్పోతారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా అదే జరుగుతోందని స్పష్టమవుతోంది.
కానీ ఉత్తమ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆర్మూరు తెరాస ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి చాలా ఘాటయిన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ హయంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరిట కాంగ్రెస్ నేతలే అనేక అక్రమాలకూ పాల్పడ్డారని, అనేక చోట్ల అసలు ఇళ్ళ నిర్మాణం చేయకుండానే ఇళ్ళు కట్టినట్లు కాగితాల మీద చూపించి సొమ్ము దిగమింగారని, కొన్ని చోట్ల గ్రామాలలో ఉన్న జనాభా కంటే అధికంగా ఇళ్ళు కట్టినట్లు చూపించి ప్రభుత్వం ధనం బొక్కేసారని, ఆ ఆక్రమాలపై విచారణ పూర్తయితే కాంగ్రెస్ నేతల్లో సగం మంది జైలుకి వెళ్ళవలసి వస్తుందని ఆయన అన్నారు. అంటే కాంగ్రెస్ నేతలు పేదల పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడటం కూడా నిజమేనని స్పష్టం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close