మోడీ కంటే బాబే బెస్ట్ అట!

హామీల అమలు విషయంలో తేడా వచ్చినప్పుడల్లా తెదేపా నేతలలో ఎవరో ఒకరు లేదా కొందరు కేంద్రం మీద విమర్శలు గుప్పించడం, ఆ తరువాత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఎవరూ విమర్శలు చేయవద్దని హెచ్చరించడం అంతా ఒక ఆనవాయితీగా మారిపోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పగానే మళ్ళీ అదే తంతు మొదలయింది. ఈసారి తెదేపా (విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్) ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు చంద్రబాబు రేయింబవళ్ళు కష్టపడుతున్నారని, ఆయన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా బీజేపీ వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ కంటే చంద్రబాబు నాయుడే చాలా బాగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీని కూడా ఆయన పరోక్షంగా విమర్శించారు. కాంగ్రెస్, సీపీఐ పార్టీల చేతుల్లో శివాజీ ఒక పావుగా మారారని, అతనిని అడ్డుపెట్టుకొని ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇంతవరకు తెదేపా నేతలెవరూ కూడా వెంకన్నలాగ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని పేరుపెట్టి ఈవిధంగా విమర్శలు చేయలేదు. కనుక రేపు చంద్రబాబు నాయుడు అతనిని పిలిచి మందలించినట్లు వార్తలు రావచ్చును. నటుడు శివాజీ విషయంలో ఆయన చేసిన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ రేపు ఘాటుగా జవాబు ఇవ్వవచ్చును. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తోంది. ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటాన్ని అధికార పార్టీ విమర్శించినా, వ్యతిరేకించినా దానినే ఆయుధంగా చేసుకొని తెదేపా ప్రభుత్వంపై ప్రయోగించే అవకాశం దానికి దక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close