చివరి కోరిక తీరకుండానే పోయిన యాకూబ్: ఇంటికి చేరిన మృతదేహం

హైదరాబాద్: ఈ ఉదయం ఉరిశిక్ష అమలుచేయబడిన యాకూబ్ మెనన్ చివరికోరిక తీరకుండానే ప్రాణాలు విడిచాడు. ఉరిశిక్ష అమలుచేసేముందు ఖైదీలను చివరికోరిక అడగటం రివాజు. యాకూబ్ తన కుమార్తె జుబేదాతో మాట్లాడలని ఉందని చెప్పాడు. అయితే దానికి సమయంలేకపోవటంతో, ఫోన్‌లో కుమార్తెతో మాట్లాడించారు. యాకూబ్‌ను అతని 53వ పుట్టినరోజునాడే, ఇవాళ ఉదయం ఏడుగంటలప్రాంతంలో ఉరితీశారు. పోస్ట్‌మార్టమ్ కార్యక్రమాలు ముగిసిన తర్వాత యాకూబ్ సోదరులు సులేమాన్, ఉస్మాన్‌లకు ఉదయం 9.30గంటల ప్రాంతంలో జైలు అధికారులు మృతదేహాన్ని అప్పగించారు. దానికిముందు, మృతదేహంతో ఎలాంటి ప్రదర్శనలూ, ఊరేగింపులూ నిర్వహించబోమని వారినుంచి లిఖితపూర్వక అంగీకారపత్రాన్ని తీసుకున్నారు. సులేమాన్, ఉస్మాన్ మృతదేహాన్ని తీసుకుని 9.45గంటలకు నాగపూర్ విమానాశ్రయంనుంచి ముంబాయికి బయలుదేరారు. 12.10గంటలకు వారు ముంబాయి చేరుకున్నారు. విమానాశ్రయంనుంచి ఇంటికి, స్మశానానికి తీసుకెళ్ళేటపుడు ఫోటోలు తీయకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం ఒంటిగంటప్రాంతంలో యాకూబ్ మృతదేహం మాహిమ్‌ ఏరియాలోని అతని ఇంటికి చేరుకుంది. మరోవైపు యాకూబ్ ఉరి సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close