ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని స్థితిలో పడిపోయారు. బస్సు యాత్ర అనుకున్న అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవడంతో అధికారుల సహకారంతో నెగ్గుకురావొచ్చునని అంచనా వేసినా ఈసీ షాక్ ఇస్తోంది. దీంతో ఏపీలో వైసీపీ ఎన్నికల రాజకీయం ఫ్యాక్షన్ పాలిటిక్స్ ను పరిచయం చేయనుందా..? అనే సందేహాలు వస్తున్నాయి.

ఏపీలో ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం కలగడం లేదంటున్న జగన్ వ్యాఖ్యలే ప్రజల్లో ఈ అనుమానాలకు కారణం అవుతున్నాయి. అధికారులను మార్చేసినంత మాత్రాన ఎన్నికలు సజావుగా జరగవని భావించడం చూస్తుంటే జగన్ అధికారులపై ఎంతలా ఆధారపడ్డారో స్పష్టం అవుతోంది. ఇప్పుడు వైసీపీ అనుకూల ఆఫీసర్లు లేకపోవడంతో వైసీపీ ఏం చేయనుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతోంది. అధికారం కోసం ఎలాంటి రాక్షస క్రీడలకైనా వైసీపీ పాల్పడుతుందని విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

పోలింగ్ తేదీ సమీపించే కొద్ది వైసీపీ తోక జాడిస్తుందని…తన ఫ్యాక్షన్ పాలిటిక్స్ ను రుచి చూపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు లేకపోతేనేం తమకు తెలిసిన విద్యతో ఎన్నికలను ఎదుర్కొంటామనే తరహలో వైసీపీ అక్రమాలకు, అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close