రేషన్ కార్డులు ఏరివేయడంలో వైసీపీ సర్కారుకీ మొహమాటమే..!

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పధ్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ప్రత్యేకంగా నవశకం పేరుతో.. వాలంటీర్లతో నిర్వహించిన సర్వేలో ఈ లెక్క తేలింది. ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు అనర్హుల వద్ద ఉన్నాయని గుర్తించినా… వాటిని తీసేసిన తర్వాత … ఉండే కార్డులు కోటి ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఐదు వేలు. అంటే.. అక్షరాలా.. కోటి ఇరవై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నమట. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కుటుంబాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 1,41,13,797 ఉన్నాయి. అంటే.. అనర్హుల్ని తీసేసిన తర్వాత రేషన్ కార్డు లేని.. కుటుంబాలు కేవలం పదకొండు లక్షలు మాత్రమే. అంటే ఆంధ్రప్రదేశ్‌లో 90 శాతానికిపైగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని భావించాల్సి వస్తుంది. కొసమెరుపేమిటంటే.. అనర్హుల్ని తీసేశారు కానీ.. కొత్తవి ఇవ్వలేదు. రేపు గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత కొత్త కార్డులు జారీ చేస్తారు.

ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్న రేషన్ కార్డులు కాబట్టి.. వారి పార్టీకి చెందిన వారు ఎవరు వచ్చినా.. రేషన్ కార్డు మంజూరు చేయక తప్పదు. అంటే.. ఇప్పుడు తీసేసిన ఆ పధ్నాలుగు లక్షల రేషన్ కార్డులకు మరిన్ని అదనంగా వచ్చి చేరడం ఖాయం. నిబంధనల ప్రకారం రేషన్ కార్డులను దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే మంజూరు చేయాలి. కానీ ప్రతి ప్రభుత్వ పథకానికి వైట్ రేషన్ కార్డు మాత్రమే అర్హతగా ప్రభుత్వ నిర్ణయిస్తూండటంతో.. ఎంత ఉన్నతమైన కుటుంబం అయినా.. భరోసా కోసం..తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని రేషన్ కార్డు పొందుతున్నాయి. అందుకే.. జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఈ రేషన్ కార్డు మాత్రమే అర్హతగా కాకుండా ప్రతీ పథకానికి ఓ కార్డు మంజూరు చేయాలని నిర్ణయించింది.

రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన, పించన్ కానుక ఇలా అన్నింటికీ ఒక్కో కార్డు జారీ చేస్తారు. దీంతో.. రేషన్ కార్డులు పొందాలనే ఆలోచన ప్రజల్లో తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయతే.. అన్నీ పక్కాగా అమలు చేస్తామని… అనర్హులకు పథకాలు అందనీయబోమని చెప్పుకొచ్చిన ప్రభుత్వం.. వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. అయినప్పటికీ వాస్తవ లబ్దిదారులను మాత్రమే ఉంచడంలో విఫలమయింది. బహుశా.. ఈ పథకాలు అందకపోతే.. ప్రజాగ్రహం ఎదురవుతుందని భయపడి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close