లాఠీచార్జ్, అరెస్టుల తర్వాత రాజధాని రైతులకు కౌలు చెల్లించిన సర్కార్..!

రాజధాని రైతులు నిరసనలకు దిగడం.. హైకోర్టులోనూ పిటిషన్లు వేయడంతో.. ప్రభుత్వం అఘమేఘాలపై అమరావతి రైతులకు కౌలును అకౌంట్లలో జమ చేసింది ప్రభుత్వం. రైతు కూలీలకు సామాజిక పెన్షన్లు కూడా మంజూరు చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం.. ప్రతి ఏడాది ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. ఈ కౌలును జూన్, జూలైలో చెల్లించాలి. ప్రభుత్వం మారిన తర్వాత కౌలు కోసం.. రైతులు ఉద్యమాలు చేయాల్సి వస్తోంది. రైతులు గొంతెత్తినప్పుడు జీవోలిస్తున్నారు. కానీ నిధులు ఇవ్వడం లేదు.

రోడ్డెక్కడమో..కోర్టుకు వెళ్లడమో చేసిన తర్వాత కౌలు చెల్లిస్తున్నారు. కౌలు అడిగిన రైతులపై లాఠీచార్జ్ చేయడం… మహిళా రైతుల్ని సైతం అరెస్ట్ చేయడంపై అన్ని పార్టీల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మరో వైపు రాజధానికి చెందిన రైతులు తమకు వెంటనే కౌలు ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ వేసారు. విచారణ జరిపిన హైకోర్టు రెండు రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ పరిణామాల తర్వాత కౌలు కోసం రూ. 153 కోట్లు, పెన్షన్ ల కోసం రూ. 9 కోట్ల 73 లక్షల విడుదల చేశామని బొత్స ప్రకటించారు.

ప్రభుత్వం కొత్తగా భూములు అమ్ముకున్న రైతులకు కౌలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వివరాలు సిద్ధం చేస్తున్నామని… బొత్స ప్రకటించారు. అమరావతికి భూములు ఇచ్చి… ఇప్పటికీ అమ్ముకోని వారికి మాత్రమే ఇక నుంచి కౌలు ఇస్తామని చెబుతున్నారు. అయితే.. 90 శాతం మందికిపైగా రాజధాని రైతులు తమ ప్లాట్లను అమ్ముకోలేదని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close