నెల్లూరు, పల్నాడులో వైసీపీ ఖాళీ !

నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ ఖాళీ అవుతోంది. టీడీపీ గత ఎన్నికల్లో వైట్ వాష్‌కి గురైన నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్, క్యాడర్ అంతా టీడీపీ గూటికి చేరుతున్నారు. కీలకమైన నేత…బడా పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరగణం.. ద్వితీయ శ్రేణి క్యాడర్ టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరులో సగం సీట్లు గెలిచిన దాఖలు లేవు. గతంలో ఇదే జిల్లా నుండి టీడీపీ లో కిముగ్గురు వైసీపీ ఎమ్మెల్యే లు చేశారు. వీరి రాకతో నెల్లూరు జిల్లాలో టీడీపీ కంచుకోట గా మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లా నుంచి రెండు దక్కినా గొప్పేనన్న వాదన అప్పుడే వినిపిస్తోంది.

మరో వైపు పల్నాడు నుండి కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారు. సాయంత్రం జరగబోయే సభలో పల్నాడు జిల్లా నుండి ఎంపీ కృష్ణ దేవరాయలు.. ఎమ్మెల్సీ జంగా కృషమూర్తి… మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు సహా కొన్ని వందల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు…వైసీపీ క్యాడర్ టీడీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ 7 అసెంబ్లీ తో పాటుగా పార్లమెంట్ ని కైవసం చేసుకుంది.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ప్రజల్లో బలం ఉన్న నేత కృష్ణ దేవరాయలు… వైసీపీ క్యాడర్ ను తీసుకుని టీడీపీలో చేరుతున్నారు.

ఇక ఉదయమే చంద్రబాబు నివాసంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. ఆయన కూడా వైసీపీ తీరును తప్పు బట్టి బయటకు వచ్చారు. మైలవరం వైసీపీ క్యాడర్ లో సగంపైనే ఆయన వెంట వస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చేరికల జోరు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close